Suram prashanth talks

Suram prashanth talks 🎬 Every Story Matters
🔥 Entertainment | Talks | Trending Updates
📌 Follow for Daily Fresh Content

07/08/2026

కొరియన్ కనకరాజు మూవీ రివ్యూ..

Welcome to Sp Telugu Talks, your one-stop destination for the latest news, trending stories, and insightful updates from around the world! Stay informed with our daily coverage on current events, breaking news, entertainment, politics, technology, and much more. We bring you reliable, unbiased, and engaging content that keeps you ahead of the curve. Don’t forget to subscribe and hit the bell icon to stay updated with our fresh videos every day. Join the Sp Telugu Talks community for the news that matters most

📢🏠ఇంకా అప్లై చేసుకోలేదా? ఇందిరమ్మ ఇళ్ల పథకం దరఖాస్తుల గడువు ముగిసేది ఎప్పుడంటే?                       📢🏠ఇందిరమ్మ ఇళ్ల పథ...
07/08/2026

📢🏠ఇంకా అప్లై చేసుకోలేదా? ఇందిరమ్మ ఇళ్ల పథకం దరఖాస్తుల గడువు ముగిసేది ఎప్పుడంటే?

📢🏠ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా మొదటి విడతలో 15పైగా నియోజకవర్గాల్లో ఏడు వేలకి పైగా ఫ్లాట్లు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 10వ తేదీ వరకు మాత్రమే అవకాశం ఉంది. ఇప్పుడు దరఖాస్తులకు గడువు..

మొదటి విడతలో 15పైగా నియోజకవర్గాల్లో ఏడు వేలకి పైగా ఫ్లాట్లు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 10వ తేదీ వరకు మాత్రమే అవకాశం ఉంది. ఇప్పుడు దరఖాస్తులకు గడువు తేదీని పొడిగించే ప్రసక్తే లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఈ ఇళ్ల మార్కెట్ విలువ 40 నుంచి 60 లక్షల వరకు ఉంటుంది. అర్హులైన వారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేసుకోవడం చాలా ముఖ్యం.

❤️🧵ఒకే ఒక్క అగ్గిపెట్టె... 5.5 మీటర్ల పట్టుచీర!❤️🧵 చేనేత కళకు ప్రపంచవ్యాప్తంగా జేజేలు!🙌సిరిసిల్లకు చెందిన ప్రఖ్యాత చేనేత...
07/08/2026

❤️🧵ఒకే ఒక్క అగ్గిపెట్టె... 5.5 మీటర్ల పట్టుచీర!❤️🧵 చేనేత కళకు ప్రపంచవ్యాప్తంగా జేజేలు!🙌

సిరిసిల్లకు చెందిన ప్రఖ్యాత చేనేత కళాకారులు నల్ల విజయ్ కుమార్, వెల్ది హరిప్రసాద్ ఈ అరుదైన చీరల తయారీలో ప్రత్యేక గుర్తింపు పొందారు. విజయ్ తండ్రి నల్ల పరంధాములు 1987లో తొలిసారిగా అగ్గిపెట్టెలో పట్టే చీరను రూపొందించి సిరిసిల్ల చేనేతకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు. ప్రస్తుతం అదే వారసత్వాన్ని విజయ్ కుమార్ విజయవంతంగా కొనసాగిస్తూ చేనేత కళకు కొత్త గుర్తింపును తీసుకొస్తున్నారుసిరిసిల్లలో తయారైన ఈ అగ్గిపెట్టె చీర అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మిషెల్ ఒబామాలకు ఈ ప్రత్యేక చీరను బహుమతిగా అందించడం ద్వారా సిరిసిల్ల చేనేత ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. అలాగే ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక శాలువాను రూపొందించి సన్మానించారు.

07/08/2026

శ్రీ రాములు థియేటర్ లో వరుణ్ తేజ్ లావణ్య

Welcome to Sp Telugu Talks, your one-stop destination for the latest news, trending stories, and insightful updates from around the world! Stay informed with our daily coverage on current events, breaking news, entertainment, politics, technology, and much more. We bring you reliable, unbiased, and engaging content that keeps you ahead of the curve. Don’t forget to subscribe and hit the bell icon to stay updated with our fresh videos every day. Join the Sp Telugu Talks community for the news that matters most

గ్లామర్ సీన్స్ చేయమంటే ఏడ్చేశాను నాకెందుకు అలాంటి రోల్స్ రాలేదు అంటూ ఎమోషనల్!తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్...
07/08/2026

గ్లామర్ సీన్స్ చేయమంటే ఏడ్చేశాను నాకెందుకు అలాంటి రోల్స్ రాలేదు అంటూ ఎమోషనల్!

తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్న నటి మీనా, తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో గ్లామర్ పాత్రలు, కెరీర్ ఎంపికలపై తన మనసులోని మాటలను పంచుకున్నారు. సినీ రంగంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపును, గౌరవాన్ని ఎలా పొందాలనే దానిపై ఆమె స్పష్టమైన ఆలోచన గురించి వివరించారు. మీనా తన కెరీర్ తొలినాళ్లలో, గ్లామర్ పాత్రలు చేసే నటీమణులకు లభించే ప్రాధాన్యతను, అటెన్షన్‌ను చూసి, తానూ అలాంటి పాత్రలు చేయాలా అని ఆలోచించానని ఒప్పుకున్నారు. తాను కూడా ఒక హీరోయిన్నే కదా, వారికంటే సీనియర్‌ని అయినా తనకు ఎందుకు అంత ప్రాధాన్యత లభించడం లేదని ప్రశ్నించుకునేదాన్నని తెలిపారు. అప్పట్లో తన తల్లితో ఈ విషయమై ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయని మీనా భావోద్వేగంగా వెల్లడించారు. అయితే, ఈ ఆలోచనల నుండి ఆమె తన కెరీర్ ఎంపికల వైపు దృష్టి మళ్లించారు. “నా క్యారెక్టర్ ఏంటి, నా పాత్ర ఏంటి, నేను ఏం చేయగలను?” అనే ప్రశ్నలు తన ప్రతి సినిమా ఎంపికలోనూ ముఖ్యమయ్యాయని మీనా పేర్కొన్నారు. ప్రేక్షకులు సినిమా చూసి థియేటర్ నుండి బయటకు వస్తున్నప్పుడు తన పాత్రను గుర్తుపెట్టుకోవాలని తను ఎప్పుడూ కోరుకునేదాన్నని అన్నారు.

డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్.. యూట్యూబ్‌ను షేక్ చేస్తుంది బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో కంటెస్టెంట్స్ గా చేశారు...
06/08/2026

డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్..

యూట్యూబ్‌ను షేక్ చేస్తుంది

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో కంటెస్టెంట్స్ గా చేశారు డీమాన్ పవన్, రీతూ చౌదరి. ఈ రియాలిటీ షోలో వీరు చేసిన అల్లరి, పండించిన కెమిస్ట్రీకి బుల్లితెరపై మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ బిగ్ బాస్ జోడీ ఒక ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ చేశారు.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు డీమాన్ పవన్, రీతూ చౌదరి. ఈ రియాలిటీ షోలో వీరు చేసిన అల్లరి, కెమిస్ట్రీకి బుల్లితెరపై మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రియాలిటీ షో తర్వాత ఈ జోడీకి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఏర్పడింది. పలు టీవీ షోస్, రియాలిటీ షోస్ లోనూ సందడి చేశారు. తాజాగా వీరిద్దరు ఒక ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ లో సందడిచేశారు. ‘బంగారం’ అనే ఆల్బమ్ సాంగ్ లో జంటగా కనిపించి ఆకట్టుకున్నారు. ఇటీవలే రిలీజైన ఈ సాంగ్ కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. మొదటి నుంచి చివరి వరకు ఫీల్‌గుడ్ రొమాంటిక్ వైబ్‌తో సాగే ఈ సాంగ్ లో డెమాన్ పవన్, రీతూ చౌదరి స్క్రీన్ ప్రెజెన్స్ అందరినీ ఆకట్టుకుంది. ఇందులో మెలోడీ లిరిక్స్, సాంగ్ విజువల్స్, ఇద్దరీ కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుండటంతో ఈ పాట యూట్యూబ్ లో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. బంగారం పాటకు అఫ్రోజ్ అలీ సాహిత్యం అందించడంతో పాటు అతనే స్వరపరిచి, స్వయంగా ఆలపించారు. అలాగే మరో స్టార్ సింగర్ సమీరా భరద్వాజ్ వోకల్స్ పాటకు మరింత అందం తీసుకొచ్చాయి. మరీ ముఖ్యంగా రంజిత్ రెడ్డి అందించిన మ్యూజిక్ ఈ పాటకు పెద్ద ప్లస్‌గా నిలిచిందని చెప్పవచ్చు.

మెలోడీ, బీట్‌లు, అరేంజ్‌మెంట్ అన్నీ కలిసి ‘బంగారం’ పాటను మళ్లీ మళ్లీ వినాలనిపించేలా చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో మంచి ట్రెండ్ అవుతూ మ్యూజిక్ లవర్స్ ప్లే లిస్ట్‌లో చోటు సంపాదించుకుంది. ఈ బంగారం పాటకు డైరెక్టర్, కొరియోగ్రాఫర్ విజ్జు ముధిరాజ్ మాట్లాడుతూ.. ‘డెమాన్ పవన్, రీతూ చౌదరి సహా మొత్తం టీమ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రేక్షకులు పాటను ఆదరిస్తుండటం సంతోషంగా ఉందని, ఈ ఆదరణతో పాట మరింత పెద్ద విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు.

ఇదే క్రమంలో డీమాన్ పవన్ మాట్లాడుతూ.. ‘ డీపీ క్రియేషన్స్ బ్యానర్‌ను మరింత ముదుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతోనే ఈ సాంగ్ ను విడుదల చేశాం. భవిష్యత్తులో ఇదే బ్యానర్‌పై వెబ్ సిరీస్‌లు, సినిమాలు, పెద్ద తెర చిత్రాలను కూడా నిర్మించాలనే ప్రణాళిక ఉంది. ఈ పాటలో రీతూ చౌదరి తనకు ఎంతో సహకరించింది. షూటింగ్ సమయంలో మంచి స్నేహితులమయ్యాం. నాగార్జున పాటను లాంచ్ చేసి ప్రశంసించడం, ఉప్పలపాటి శ్యామలాదేవి ప్రోమోను విడుదల చేసి ప్రోత్సహించడం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది’ అని చెప్పుకొచ్చాడు.

ఆర్బీఐ ప్రస్తుతం ఉన్న పేపర్ కరెన్సీ స్థానంలో పాలిమర్ నోట్లను చలామణిలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. కేంద్...
06/08/2026

ఆర్బీఐ ప్రస్తుతం ఉన్న పేపర్ కరెన్సీ స్థానంలో పాలిమర్ నోట్లను చలామణిలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. కేంద్రం నుంచి కూడా ఆర్బీఐకు అనుమతి వచ్చింది. దీంతో ఆర్బీఐ తయారీ పనులను ముమ్మరం చేసింది. ప్లాస్టిక్ నోట్ల ప్రింటింగ్ త్వరలోనే ప్రారంభించనుండగా.. ఇప్పటికే పాలిమర్ షీట్ల కోసం గ్లోబల్ టెండర్లను ఆహ్వానించింది. త్వరలోనే టెండర్లను ఖరారు చేయనుండగా.. అనంతరం ప్రింటింగ్ మొదలుపెట్టనుందని తెలుస్తోందిఅయితే ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను ఎప్పుడు చలామణిలోకి తీసుకొస్తామనే విషయంపై ఆర్బీఐ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. వచ్చే ఏడాది నుంచే వీటిని ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. 2027 ఆర్ధిక సంవత్సరం ప్రారంభంలోనే ప్రారంభించనున్నట్లు ఆర్బీఐ స్పష్టం చేసింది. ఈ మేరకు తాజాగా ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. కొన్ని దేశాల్లో పాలిమర్ నోట్లు 30 ఏళ్లకుపైగా మన్నిక కలిగి ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు.

మంచి మనసు చాటుకున్న రాహుల్ సిప్లిగంజ్..! గబ్బర్ సింగ్' రమేష్ చికిత్సకు సాయం!కృతజ్ఞత, మానవత్వానికి నిలువెత్తు ఉదాహరణగా ని...
06/08/2026

మంచి మనసు చాటుకున్న రాహుల్ సిప్లిగంజ్..! గబ్బర్ సింగ్' రమేష్ చికిత్సకు సాయం!

కృతజ్ఞత, మానవత్వానికి నిలువెత్తు ఉదాహరణగా నిలిచారు సింగర్ రాహుల్ సిప్లిగంజ్. ‘హిజ్రా’ పాటలో కలిసి పనిచేసిన గబ్బర్ సింగ్ రమేష్‌ను కష్టకాలంలో ఆదుకున్నారు. బ్రెయిన్ స్ట్రోక్‌తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రమేష్ పరిస్థితి తెలుసుకున్న వెంటనే స్పందించారు రాహుల్. రమేష్ చికిత్స కోసం వెంటనే రూ.1 లక్ష ఆర్థిక సహాయం అందించారు. “కలిసి పనిచేసిన వారిని మరచిపోకుండా అండగా నిలిచిన రాహుల్ సిప్లిగంజ్ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది. ఈ క్రమంలో గబ్బర్ సింగ్ రమేష్ త్వరగా కోలుకోవాలని అభిమానులు, సినీ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు.గబ్బర్ సింగ్ తో పాటు పలు తెలుగు సినిమాల్లో నటించి మెప్పించిన రమేష్ గత నెలలో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడడంతో కుటుంబ సభ్యులు అతనిని వెంటనే అపోలో ఆస్పత్రికి తరలించి ప్రాణాపాయం నుంచి కాపాడారు. ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి రమేష్ కు అండగా నిలిచారు. వాళ్ల కుటుంబ సభ్యులను కలిసి చికిత్స ఖర్చుల కోసం రమేష్ సతీమణికి తన తరఫున రూ. 3 లక్షల చెక్కును అందజేశారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకం ద్వారా కూడా అవసరమైన సహాయం అందేలా చేస్తానని రమేష్ కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు చిరంజీవి.

06/08/2026

watch till the end

Welcome to Sp Telugu Talks, your one-stop destination for the latest news, trending stories, and insightful updates from around the world! Stay informed with our daily coverage on current events, breaking news, entertainment, politics, technology, and much more. We bring you reliable, unbiased, and engaging content that keeps you ahead of the curve. Don’t forget to subscribe and hit the bell icon to stay updated with our fresh videos every day. Join the Sp Telugu Talks community for the news that matters most

06/08/2026

watch till the end

watch till the end

Welcome to Sp Telugu Talks, your one-stop destination for the latest news, trending stories, and insightful updates from around the world! Stay informed with our daily coverage on current events, breaking news, entertainment, politics, technology, and much more. We bring you reliable, unbiased, and engaging content that keeps you ahead of the curve. Don’t forget to subscribe and hit the bell icon to stay updated with our fresh videos every day. Join the Sp Telugu Talks community for the news that matters most

Address

Hyderabad
500032

Alerts

Be the first to know and let us send you an email when Suram prashanth talks posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share