vkpaladugu

vkpaladugu ...............

23/02/2026

సంగడిగుంట బిర్యాని సెంటర్‌పై ఆరోపణలు తీవ్రం – నాసిరకం ఆహారం విక్రయం?

గుంటూరు నగరంలోని సంగడిగుంట ప్రాంతంలో ఉన్న ఓ బిర్యాని సెంటర్‌పై ఆరోపణలు మరింత తీవ్రమయ్యాయి. ఇప్పటికే (కబరస్థాన్‌) స్మశాన వాటికలో ఉపయోగించిన కర్రలను వంటకు వినియోగిస్తున్నారనే ఆరోపణల మధ్య, రెస్టారెంట్‌లో గడ్డకట్టిపోయిన, దుర్వాసన వచ్చే నాసిరకం మాంసాన్ని వినియోగదారులకు విక్రయిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. సదరు వ్యక్తులు హోటల్ యజమానిని ప్రశ్నించగా వాడితే ఏమైద్ది అనే వింత పోకడలు వెళ్లే సమాధానం ఇస్తున్నట్లు వీడియోలో స్పష్టంగా కనబడుతుంది. ఈ విషయంపై సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతుండగా, ప్రజలు ఆహార భద్రత అధికారులతో పాటు సంబంధిత శాఖలు తక్షణమే సమగ్ర విచారణ జరిపి, ప్రజారోగ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు.
guntureastconstituency

22/02/2026

తమిళనాడులో ఉగ్ర కుట్ర భగ్నం..
తిరుప్పూర్, తమిళనాడు లోని ఐదు ప్రాంతాల్లో ఉంటూ పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థలకై కంటెంట్ పోస్ట్ చేస్తున్న ఆరుగురు అరెస్ట్..

22/02/2026

*ప్రొఫెసర్ ను కొట్టిన మెడికల్ స్టూడెంట్*

కర్ణాటకలోని డా. మలన్రెడ్డి హోమియోపతి కాలేజీలో ఓ అ.ప్రొఫెసర్పై స్టూడెంట్ దాడి చేశాడు. ఎగ్జామ్ జరుగుతుండగా షబాజ్ అనే విద్యార్థి ఫోన్లో చూస్తూ కాపీ కొడుతున్నట్లు అ.ప్రొఫెసర్ గుర్తించారు. ఆన్సర్ షీట్ తీసుకొని అతడిని బయటకు వెళ్లమని ఆదేశించగా షబాజ్ ప్రొఫెసర్పై దాడి చేశాడు. షబాజ్ను కాలేజీ యాజమాన్యం అన్ని పరీక్షల నుంచి డిబార్ చేసింది. ఈనెల 18న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా వైరలవుతోంది.

22/02/2026

*దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన అయేషా మీరా కేసు క్లోజ్‌*

19 ఏళ్లుగా త‌ల్లిదండ్రులు చేస్తున్న న్యాయ‌పోరాటం వృధా

ఆధారాలు లేవ‌ని కేసు కేసు క్లోజ్ చేసిన సీబీఐ

అసలు దోషి ఎవరో తేల్చలేక చేతులెత్తేసిన‌ సీబీఐ

హైకోర్టు ఆదేశాల‌తో 2019లో రంగంలోకి దిగిన సీబీఐ

ఆరేళ్ల పాటు ద‌ర్యాప్తు చేసిన సీబీఐ

త‌మ‌కు ఎలాంటి కొత్త ఆధారాలు లభించ‌లేద‌న్న సీబీఐ

2007 డిసెంబర్‌ 27న కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఉమెన్స్‌ హాస్టల్‌లో

దారుణ హ‌త్య‌కు గురైన అయేషా మీరా

ఈ కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్న స‌త్యంబాబు విడుద‌ల

రీ పోస్టుమార్టం కోసం సేక‌రించిన త‌మ కూతురి అవ‌శేషాలు ఇవ్వాల‌న్న‌ అయేషా మీరా త‌ల్లి

ఈనెల 27న అయేషా మీరా అంత్య‌క్రియ‌లు మ‌త ఆచారం ప్ర‌కారం నిర్వ‌హించాల‌న్న సీబీఐ కోర్టు.

21/02/2026

గుంటూరు నగరంలో రోజు రోజుకు పెరుగిపోతున్న ఫుడ్ యాఫియా అరాచకాలు..

కొద్ది రోజులు క్రితం ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేసిన విషయం మరువకముందే మరో ఘటన చోటు చేసుకుంది...

రైల్వే స్టేషన్ ప్రాంగణంలో ఉన్న రైల్ కోచ్ రెస్టారెంట్ లో వినియోగదారుడికి చేదు అనుభవం ఎదురైంది..

ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ లో ఆర్డర్ చేసిన ఫుడ్ ను తినలేని విధంగా ఇచ్చిన రైల్ కోచ్ రెస్టారెంట్ యాజమాన్యం..

ఆర్డర్ చేసిన ఫుడ్ బాగోలేదని తెలిపిన వినియోగదారుడితో దురుసుగా ప్రవర్తించిన రెస్టారెంట్ యాజమాన్యం..

రైల్ కోచ్ రెస్టారెంట్ ప్రారంభం వివాదాలకు అడ్డాగా మారిందంటున్న వినియోగదారుడు...

ఇటువంటి రెస్టారెంట్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించి వినియోగదారులకు మంచి ఆహారం అందించాలని పలువురు వినియోగదారులు కోరుతున్నారు..

21/02/2026

అమరావతి రోడ్డులోని అంబేద్కర్ నగర్ వద్ద గల మసీదు ఎదురు నూతనంగా ఏర్పాటు చేసిన బార్ ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించిన ముస్లిం మైనార్టీ సోదరులు..

21/02/2026

గుంటూరు: 'నా కూతురి చావుకు అతనే కారణం'

రహీం వేధింపులు భరించలేక తన కూతురు ఆత్మహత్య చేసుకుందని తండ్రి శ్రీనివాస్ రెడ్డి కన్నీరుమున్నీరయ్యారు. తన కుమార్తె ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతానని బెదిరించడం వల్లే ఈ ఘాతుకానికి పాల్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని తాడేపల్లి సీఐ వీరేంద్ర తెలిపారు.

21/02/2026

జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడి – పోలీసులకు ఫిర్యాదు
గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై ఈ రోజు ఉదయం సుమారు 11 గంటల సమయంలో దాడి జరిగినట్లు నాయకులు నగరంపాలెం పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేశారు. బీజేపీ యువమోర్చా పేరుతో కొందరు వ్యక్తులు ప్రణాళికాబద్ధంగా వచ్చి రాళ్లు, కోడిగుడ్లు విసిరి పార్టీ బ్యానర్లు, ఫ్లెక్సీలు ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు.
కొంతమంది పెట్రోలు వంటి దహన పదార్థాలతో కార్యాలయంపై దాడి చేయడానికి యత్నించినట్లు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే షేక్ మస్తాన్ వలి ఆరోపించారు. ఇటువంటి గూండా చర్యలపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులు కోరుతూ జిల్లా కాంగ్రెస్ నాయకులు వినతిపత్రం సమర్పించారు.

21/02/2026

గుంటూరు: నల్లపాడు పోలీస్ స్టేషన్లో సంతకం చేసేందుకు హాజరైన మాజీ మంత్రి అంబటి రాంబాబు.. వైఎస్ఆర్సిపి లీగల్ సెల్ న్యాయవాదులు..

21/02/2026

Sweeghee is a company of thieves.. Sweeghee is a Taliban company that sucks people's money like blood.. As far as I know, the frauds going on in the country, where the Sweeghee app is stealing from the people for no reason, are endless and priceless.. With the money this Sweeghee company is stealing from the people, one parliamentary election in the country can be held peacefully.. When I ordered on this Sweeghee app, they did not deliver the item, and they asked for the 200 rupees that should have been returned to me, but they cheated me..

21/02/2026

గుంటూరు నల్లచెరువులో దారుణం..

1 వ తరగతి చదువుతున్న 6 సంవత్సరాల ఫణింద్ర రెడ్డి అనే బాలుడుపై ఏకంగా 10 కి పైగా కుక్కలు దాడి..

బాలుడిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన తల్లి గౌతమి, తండ్రి శివారెడ్డి, కుటుంబ సభ్యులు..

గౌతమి, శివారెడ్డి దంపతులకు ఇద్దరు కుమారులు..

రెండవ కుమారుడు ఫణీంద్ర రెడ్డికి కుక్కల దాడిలో తీవ్ర గాయాలు..

బాలుడి పరిస్థితి విషమం..

విషయం తెలుసుకుని హుటాహుటిన జిజిహెచ్ కి చేరుకున్న గుంటూరు నగర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, ఈస్ట్ ఇంచార్జ్ షేక్ నూరి ఫాతిమా..

ఆసుపత్రిలో కనీస వైద్య వసతులు లేని వైనం..

వైద్యులను ప్రశ్నించిన నూరి ఫాతిమా..

నూరి ఫాతిమా రాకతో హుటాహుటిన వైద్య పరికరాలు ఏర్పాటు చేసి, వైద్య సేవలు ప్రారంభించిన వైనం..

ఐసీయూ కి ఎందుకు తరలించలేదని ప్రశ్నించడంతో పొంతన లేని సమాధానం చెప్తున్న వైద్యులు..

జరిగిన ఘటన గురించి తెలుసుకునేందుకు ఫోన్ చేసిన స్పందించని ఆసుపత్రి సూపరిండెంట్..

సూపరిండెంట్ వైఖరి పట్ల అసహనం వ్యక్తం చేసిన నూరి ఫాతిమా..

బాధిత బాలుడికి మెరుగైన వైద్య సేవలు అందించే వరకు ఆసుపత్రి నుండి బయటకు వెళ్ళేది లేదని స్పష్టం చేసిన వైసిపి నగర అధ్యక్షురాలు..

బాధిత కుటుంబానికి అండగా ఆసుపత్రికి చేరుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు..

Address

Guntur, Andhra Pradesh
Guntur
522001

Website

Alerts

Be the first to know and let us send you an email when vkpaladugu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share