15/02/2026
#నేడు_శ్రీసేవాలాల్_జయంతి_శుభాకాంక్షలు..
🌹🎉🎉🎉🌹🎉🌹🎉 #తెలంగాణగిరిజనసంఘం(TGS )ఆధ్వర్యంలో ఫిబ్రవరి 15వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న శ్రీ సేవా లాల్ మహరాజ్ 287 వ జయంతోత్సవాలను జయప్రదం చేయండి.*🙏
బంజారాలకు దిశా నిర్దేశం చేస్తూ దేశవ్యాప్తంగా పర్యటిస్తూ ఎన్నో అవాంతరాలు ఎదురైనా వాటిని ఎదిరించి బోధనలుచేస్తూ బంజారా సమాజాన్ని చైతన్యవంతం చేసిన గొప్ప సంఘ సంస్కర్తగా, పోరాట యోధుడు శ్రీ సేవా లాల్ మహరాజ్.
*ముఖ్యమైన బోధనలు*
🙏🙏🙏🙏🙏🙏🙏
*👉 బంజారాలు సంచార జీవనం వదిలి తండాలను నిర్మించుకొని స్థిర నివాసాలుగా మార్చుకోవాలన్నారు.*
*👉 బంజారాలకున్న అపారమైన పశుసంపదతో వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నారు.*
*👉 మూఢనమ్మకాలు, మద్యపానం వంటి చెడు అలవాట్ల నుండి దూరంగా ఉండాలన్నారు*
*👉 జంతుబలి ఇవ్వకూడదని సేవాలాల్ జీవించినంత కాలం హితబోధ చేస్తూనే వచ్చారు.*
*👉 ఇతర మతాల వైపు ఆకర్షితులు కాకుండా బంజారాలకున్న ప్రత్యేక సంస్కృతి, ఆచారాలు, భాష, వేషాధారణలను కాపాడుకుంటూ ఐక్యంగా ఉనికిని చాటుకోవాలన్నారు.*
*సేవాలాల్ పై ఒక కవి రాసిన అద్భుతమైన కవిత్వం కవిత్వం.*
***********************
*అజ్ఞానంలో ఉన్న నీతోటి బంజారాల విజ్ఞానం నీవు అడవిలో పరమళించిన మానవత్వ పువ్వువు నీవు కన్నీళ్ళు తుడిచేందుకు బంజారాల తోబుట్టువు నీవు జంతుబలి వద్దుంటూ ఎదిరించిన యోధుడవు నీవు నవసమాజ నిర్మాణం కోసం తండాలను స్థాపించిన ధీశాలివి నీవు బంజారాల ఉనికిని సమాజానికి చాటిచెప్పిన సామాజిక విప్లవకారుడిని నీవు*
అటువంటి గొప్ప బోధనలను సేవాలాల్ జయంతి సందర్భంగా ప్రతి తండాలో బంజారాలు చర్చించుకునే విధంగా చేయడమే కాకుండా సేవాలాల్ స్ఫూర్తితో గిరిజనులకు ఇచ్చిన రాజ్యాంగ హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రపంచీకరణ ప్రభావం వలన గిరిజనుల సంస్కృతి,భాష, ఆచారాలతో పాటు ప్రత్యేక ఉనికి తీవ్ర ప్రమాదంలో పడింది. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం గిరిజనుల సంస్కృతి, ఆచారాలపై దాడులు చేస్తూ ఆధిపత్య మత సంస్కృతిని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నది. ఇటువంటి తరుణంలో గిరిజనులకు *ఏ మత సంస్కృతితో సంబంధం లేకుండా 2027లో కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే జనాభా లెక్కల మతం అనే కాలంలో *బంజారా గిరిజనులు ప్రకృతి ఆరాధికులు* గా గుర్తింపు ఇచ్చేందుకు ప్రత్యేక కాలం పెట్టాలని డిమాండ్ చేయాల్సిన అవసరం ఉన్నది.
అభివందనములతో..
*ఆర్ శ్రీరాం నాయక్*
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
*తెలంగాణ గిరిజన సంఘం (TGS)*