SriramNaik Ramavath

SriramNaik Ramavath Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from SriramNaik Ramavath, Social Media Agency, Hyderabad.

 #నేడు_శ్రీసేవాలాల్_జయంతి_శుభాకాంక్షలు..🌹🎉🎉🎉🌹🎉🌹🎉 #తెలంగాణగిరిజనసంఘం(TGS )ఆధ్వర్యంలో ఫిబ్రవరి 15వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా...
15/02/2026

#నేడు_శ్రీసేవాలాల్_జయంతి_శుభాకాంక్షలు..
🌹🎉🎉🎉🌹🎉🌹🎉 #తెలంగాణగిరిజనసంఘం(TGS )ఆధ్వర్యంలో ఫిబ్రవరి 15వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న శ్రీ సేవా లాల్ మహరాజ్ 287 వ జయంతోత్సవాలను జయప్రదం చేయండి.*🙏

బంజారాలకు దిశా నిర్దేశం చేస్తూ దేశవ్యాప్తంగా పర్యటిస్తూ ఎన్నో అవాంతరాలు ఎదురైనా వాటిని ఎదిరించి బోధనలుచేస్తూ బంజారా సమాజాన్ని చైతన్యవంతం చేసిన గొప్ప సంఘ సంస్కర్తగా, పోరాట యోధుడు శ్రీ సేవా లాల్ మహరాజ్.

*ముఖ్యమైన బోధనలు*
🙏🙏🙏🙏🙏🙏🙏
*👉 బంజారాలు సంచార జీవనం వదిలి తండాలను నిర్మించుకొని స్థిర నివాసాలుగా మార్చుకోవాలన్నారు.*
*👉 బంజారాలకున్న అపారమైన పశుసంపదతో వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నారు.*
*👉 మూఢనమ్మకాలు, మద్యపానం వంటి చెడు అలవాట్ల నుండి దూరంగా ఉండాలన్నారు*
*👉 జంతుబలి ఇవ్వకూడదని సేవాలాల్ జీవించినంత కాలం హితబోధ చేస్తూనే వచ్చారు.*
*👉 ఇతర మతాల వైపు ఆకర్షితులు కాకుండా బంజారాలకున్న ప్రత్యేక సంస్కృతి, ఆచారాలు, భాష, వేషాధారణలను కాపాడుకుంటూ ఐక్యంగా ఉనికిని చాటుకోవాలన్నారు.*

*సేవాలాల్ పై ఒక కవి రాసిన అద్భుతమైన కవిత్వం కవిత్వం.*
***********************
*అజ్ఞానంలో ఉన్న నీతోటి బంజారాల విజ్ఞానం నీవు అడవిలో పరమళించిన మానవత్వ పువ్వువు నీవు కన్నీళ్ళు తుడిచేందుకు బంజారాల తోబుట్టువు నీవు జంతుబలి వద్దుంటూ ఎదిరించిన యోధుడవు నీవు నవసమాజ నిర్మాణం కోసం తండాలను స్థాపించిన ధీశాలివి నీవు బంజారాల ఉనికిని సమాజానికి చాటిచెప్పిన సామాజిక విప్లవకారుడిని నీవు*

అటువంటి గొప్ప బోధనలను సేవాలాల్ జయంతి సందర్భంగా ప్రతి తండాలో బంజారాలు చర్చించుకునే విధంగా చేయడమే కాకుండా సేవాలాల్ స్ఫూర్తితో గిరిజనులకు ఇచ్చిన రాజ్యాంగ హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రపంచీకరణ ప్రభావం వలన గిరిజనుల సంస్కృతి,భాష, ఆచారాలతో పాటు ప్రత్యేక ఉనికి తీవ్ర ప్రమాదంలో పడింది. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం గిరిజనుల సంస్కృతి, ఆచారాలపై దాడులు చేస్తూ ఆధిపత్య మత సంస్కృతిని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నది. ఇటువంటి తరుణంలో గిరిజనులకు *ఏ మత సంస్కృతితో సంబంధం లేకుండా 2027లో కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే జనాభా లెక్కల మతం అనే కాలంలో *బంజారా గిరిజనులు ప్రకృతి ఆరాధికులు* గా గుర్తింపు ఇచ్చేందుకు ప్రత్యేక కాలం పెట్టాలని డిమాండ్ చేయాల్సిన అవసరం ఉన్నది.

అభివందనములతో..
*ఆర్ శ్రీరాం నాయక్*
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
*తెలంగాణ గిరిజన సంఘం (TGS)*

https://youtu.be/h-vxNRboDh0?si=hWaDx43Pk0k9-Rh3
04/02/2026

https://youtu.be/h-vxNRboDh0?si=hWaDx43Pk0k9-Rh3

VOICE BANJARA TV మన గొంతు, మన హక్కు, మన భవిష్యత్తు!మీ చుట్టు పక్కన ఏదైనా అనుకోకూడని సంఘటనలు, వి*దాలు మరియు ఇతర సమస్యలు ఏవైనా ....

 #గిరిజనసంఘం 2026  #క్యాలెండర్_ఆవిష్కరణ..  జల్ జంగిల్ జమీన్ హమారా హక్కు అని నినదించిన పోరాట యోధుడు కొమరం భీమ్, భూమికోసం ...
06/01/2026

#గిరిజనసంఘం 2026 #క్యాలెండర్_ఆవిష్కరణ..

జల్ జంగిల్ జమీన్ హమారా హక్కు అని నినదించిన పోరాట యోధుడు కొమరం భీమ్, భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు కామ్రేడ్ ఠానూ నాయక్ ల చిత్రపటాలతో తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ ముద్రించిన 2026 నూతన సంవత్సర క్యాలెండర్ మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి ఆవిష్కరించారు.

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డు లోని ఎంబిభవన్ లో సోమవారం జరిగిన ఆవిష్కరణ కార్యక్రమంలో గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం ధర్మ నాయక్, ఆర్ శ్రీరాం నాయక్, ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు రవికుమార్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్, నున్నా నాగేశ్వరావు, మూడ్ శోభన్, ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి అబ్బాస్,వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట రాములు, బుర్రి ప్రసాద్,పద్మ,సిఐటియు రాష్ట్ర నాయకులు భూపాల్,జయలక్ష్మి, డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కోటా రమేష్,వెంకటేష్,గోపీ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ గిరిజనులు పేద ప్రజల హక్కుల కోసం విరోచితమైన పోరాటాలు చేసి వీరమరణం పొందిన కొమరం భీమ్, కామ్రేడ్ ఠానూ నాయక్ ల త్యాగాలను స్మరించుకునే విధంగా గిరిజన సంఘం వారి ఫోటోలతో క్యాలెండర్ తీయడం అభినందనీయమని అన్నారు. వారి ఆశయాలను కొనసాగించే విధంగా రాబోయే కాలంలో గిరిజన హక్కులు, చట్టాలను అమలు చేసే విధంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాడి సాధించుకోవాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి జి రాంజీ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చి కోట్లాదిమంది గిరిజనులు, దళితులు,పేద ప్రజల ఉపాధిని దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన హక్కులు అటవీ హక్కులను కాలరాస్తూ దేశంలో ఉన్న అడుగులు అటవీ సంపదను కార్పొరేట్లకు అప్పగించేందుకు మరో అటవీ సంరక్షణ నియమాల చట్టం 2023 పేరుతో తీసుకొచ్చిందని అన్నారు. దీనివలన పర్యావరణాన్ని ధ్వంసం చేసే విధంగా ఆరావాళీ,బస్తర్, నల్లమల వంటి ప్రతిష్టాత్మకమైన పర్వతాలు, అడవులను ఖనిజ తవ్వకాల కొరకు ఆధానీకీ బిజెపి ప్రభుత్వం అప్పగిస్తుందని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేవెళ్ల డిక్లరేషన్ పేరుతో గిరిజనులకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసే విధంగా కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. గిరిజనులకి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గిరిజన సంఘం పోరాడాలన్నారు.

అభివందనములతో..
*ఆర్ శ్రీరాం నాయక్*
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
తెలంగాణ గిరిజన సంఘం

 #మీకుమీ_కుటుంబసభ్యులకు_నూతనసంవత్సర_శుభాకాంక్షలు..*🎉🌹🎉🌹🎉🌹🎉🌹
01/01/2026

#మీకుమీ_కుటుంబసభ్యులకు_నూతనసంవత్సర_శుభాకాంక్షలు..*🎉🌹🎉🌹🎉🌹🎉🌹

17/12/2025

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 ను బిజెపి ప్రభుత్వం ఎందుకు రద్దు చేస్తోంది..?

https://youtu.be/HePBlZgsWCw?feature=shared

 #కోట్లాదిమంది_ఉపాధికి కేంద్ర బిజెపి ప్రభుత్వం  #ఉరితాడు.. మహాత్మా గాంధీ పేరునే కాదు ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసే కుట...
17/12/2025

#కోట్లాదిమంది_ఉపాధికి కేంద్ర బిజెపి ప్రభుత్వం #ఉరితాడు.. మహాత్మా గాంధీ పేరునే కాదు ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసే కుట్రలు.. తెలంగాణ గిరిజన సంఘం (TGS)

 #గిరిజన_హక్కులకోసం_జీవితాంతం కృషి చేసినడాక్టర్‌ వి.ఎన్‌.వి.కే.  #శాస్త్రి గారికి సీపీఐ(ఎం)  #నివాళిగిరిజన హక్కులు, సంస్...
09/12/2025

#గిరిజన_హక్కులకోసం_జీవితాంతం కృషి చేసినడాక్టర్‌ వి.ఎన్‌.వి.కే. #శాస్త్రి గారికి సీపీఐ(ఎం) #నివాళి

గిరిజన హక్కులు, సంస్కతి, సమస్యలపై జీవితమంతా అంకితభావంతో పనిచేసిన డాక్టర్‌ వి.ఎన్‌.వి.కే. శాస్త్రి గారి మరణం పట్ల సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ సంతాపాన్ని తెలియజేస్తూ, వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నది. ఈ రోజు మెహిదీపట్నంలోని వారి నివాసంలో శాస్త్రి గారి భౌతికకాయానికి రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...

డాక్టర్‌ శాస్త్రి గారు ఏటూరునాగారం, ఉట్నూర్‌, శ్రీశైలం, భద్రాచలం ఐటిడిఏల్లో ప్రాజెక్టు అధికారిగా, ఆ తరువాత గిరిజన సాంస్కతిక అధ్యయన సంస్థ డైరెక్టర్‌గా పనిచేసి ఆదివాసీల సంక్షేమానికి సేవలందించారు. గిరిజన సంస్కతి, సంక్షేమం, జీవనోపాధి, భౌగోళిక హక్కులపై అనేక పరిశోధనలు చేసి పుస్తకాలు, వ్యాసాలు రాసి ప్రజలను చైతన్యపర్చారు. గిరిజన హక్కులు, చట్టాల రక్షణకై అండగా ఉంటూ, సదస్సులు, సెమినార్లల్లో ప్రత్యక్షంగా పాల్గొని వారి సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చేవారు. బాక్సైట్‌ తవ్వకాల్లో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీలో సభ్యుడిగా గిరిజనులకు వాటిల్లే నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తెస్తూ, నివేదికను సమర్పించారు. ఇంద్రవెళ్ళి గిరిజన భూముల ఆక్రమణ సందర్భంగా జరిగిన పోలీస్‌ కాల్పుల్లో 25 మంది మరణించిన ఘటనపై విచారణాధికారిగా పనిచేసి పోలీసులపైనే వ్యతిరేకంగా ధైర్యంగా నివేదికిచ్చిన అరుదైన అధికారి. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన అనేక గిరిజన కమిటీల్లో సభుడిగా పనిచేసి గిరిజనుల విద్య, వైద్యం, ఉపాధి, భూముల హక్కుల పరిరక్షణకు చివరి వరకూ శ్రమించిన ఆయన సేవలు అందరికీ ఆదర్శమని జాన్‌ వెస్లీ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ అబ్బాస్‌, గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు ఆర్‌ శ్రీరాం నాయక్‌, ఎం ధర్మనాయక్‌, రైతు సంఘం నాయకుడు మూడ్‌ శోభన్‌ పాల్గొని నివాళులర్పించారు.

 #ఆహ్వానము.. గిరిజన సంఘం వ్యవస్థాపక నాయకులు, సిపిఎం సీనియర్ నాయకుడు,  #అమరజీవి_కామ్రేడ్_గుగులోత్_ధర్మా గారి*  #రెండవ_వర్...
03/11/2025

#ఆహ్వానము..
గిరిజన సంఘం వ్యవస్థాపక నాయకులు, సిపిఎం సీనియర్ నాయకుడు,
#అమరజీవి_కామ్రేడ్_గుగులోత్_ధర్మా గారి*
#రెండవ_వర్ధంతి సందర్భంగా సభ, #స్తూపం మరియు #విగ్రహ_ఆవిష్కరణ

📅 తేదీ: *నవంబర్ 5, 2025*
🕙 సమయం: *ఉదయం 10 గంటలకు*
📍 స్థలం: *గుగులోత్ ధర్మా గారి జన్మస్థలం — మంగపేట, సుజాత్‌నగర్ మండలం*

1994 నుండి గిరిజన హక్కుల సాధన కోసం జీవితాంతం పోరాడి, శ్రమజీవుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసారు. గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని, తండాలను సమగ్ర అభివృద్ధి కొరకు గ్రామ పంచాయతీలుగా గుర్తించాలని, సింగరేణిలో భూములు కోల్పోయిన గిరిజనులకు నష్టపరిహారంతో పాటు సంస్థలో ఉద్యోగాలు ఇవ్వాలని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వందలాది కిలోమీటర్ల పాదయాత్రతో పాటు ఆందోళనలు, పోరాటాలతో అనేక విజయాలను సాధించారు.ఖమ్మం లో బంజారా భవన్ కు భూమిని సాధించడం, భవన్ నిర్మాణంలో కిలక పాత్ర పోషించారు. మైదాన ప్రాంతంలో గిరిజనుల అభివృద్ధి కావాలంటే ఐటీడీఏలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లాలో అనేక కార్యక్రమాలు నిర్వహించారు. జీవితాంతం గిరిజనులు, పేద ప్రజల హక్కుల కోసం పోరాడిన యోధుడు అమరజీవి గుగులోత్ ధర్మా గారు.ఆయనను మరించుకుంటూ తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర వ్యాప్తంగా వర్ధంతి సభలను నిర్వహిస్తున్నది. అందులో భాగంగా ధర్మా గారి సొంత గ్రామమైన మంగపేటలో వారి కుటుంబ సభ్యులు స్ఫూర్తిదాయకంగా స్తూపం, విగ్రహాన్ని నిర్మించారు.ఈ కార్యక్రమాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సిపిఎం పార్టీ నిర్వహణలో జరుగుతున్నది.

ఈ కార్యక్రమంలో సీపీఎం, తెలంగాణ గిరిజన సంఘం, జాతీయ, రాష్ట్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకులు హాజరవుతున్నారు.

కావున, మీరు అందరూ హాజరై గుగులోత్ ధర్మా గారి రెండవ వర్ధంతి సభను జయప్రదం చేయవలసిందిగా మనవి.

అభివందనములతో..
*మూడ్ ధర్మ నాయక్, ఆర్ శ్రీరాం నాయక్*
తెలంగాణ గిరిజన సంఘం(TGS)
రాష్ట్ర అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు

 #గిరిజన హాస్టల్ లో పనిచేస్తున్న వర్కర్లకు టైం స్కేలు వర్తింపజేసి వారి సమస్యలు పరిష్కరించాలని, 180 కోట్ల రూపాయ బెస్ట్ అవ...
23/10/2025

#గిరిజన హాస్టల్ లో పనిచేస్తున్న వర్కర్లకు టైం స్కేలు వర్తింపజేసి వారి సమస్యలు పరిష్కరించాలని, 180 కోట్ల రూపాయ బెస్ట్ అవైలబుల్ స్కీమ్ విడుదల చేయాలని.. సాంఘిక గిరిజన శాఖ మాత్యులు అడ్లూరి లక్ష్మణ్ గారిని కలిసిన ప్రజాసంఘాల రాష్ట్ర బృందం..

 #పోరాట_విజయం...
15/10/2025

#పోరాట_విజయం...

 #వారంరోజుల్లోపు SC ST బెస్ట్ అవైలబుల్ స్కీమ్ బకాయిలు 180 కోట్లు విడుదల చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని.. sfi,kvps,tgs ...
14/10/2025

#వారంరోజుల్లోపు SC ST బెస్ట్ అవైలబుల్ స్కీమ్ బకాయిలు 180 కోట్లు విడుదల చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని.. sfi,kvps,tgs సంఘాల ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో దళిత గిరిజన విద్యార్థి సంఘాలు హెచ్చరిక...

Address

Hyderabad
500001

Website

Alerts

Be the first to know and let us send you an email when SriramNaik Ramavath posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to SriramNaik Ramavath:

Share