Twenty Four by Seven

Twenty Four by Seven advertisements all over the world

15/09/2016
ప్ర‌జా ప్ర‌తినిధులంటే ప‌బ్లిక్ సర్వెంట్ల‌ని చాటి చెప్పిన గొప్ప నాయ‌కుడు లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి..!ప‌ద‌వి, అధికారం చేతిలో ...
06/06/2016

ప్ర‌జా ప్ర‌తినిధులంటే ప‌బ్లిక్ సర్వెంట్ల‌ని చాటి చెప్పిన గొప్ప నాయ‌కుడు లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి..!

ప‌ద‌వి, అధికారం చేతిలో ఉంటే చాలు కొంద‌రు రాజ‌కీయ నాయ‌కులు, ప్ర‌జా ప్ర‌తినిధులు వాటిని త‌మ స్వార్థం కోసం ఉప‌యోగిస్తుంటారు. ఈ క్ర‌మంలో వారు త‌మ కోస‌మే కాకుండా త‌మ కుటుంబ స‌భ్య‌లు, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోసం ఆ ప‌ద‌వి, అధికారాన్ని వాడుతారు. ఈ నేప‌థ్యంలో వారు సామాన్య జ‌నాలను ఇక ఏమాత్రం ప‌ట్టించుకోరు. ప్ర‌స్తుతం ఉన్న రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌లో దాదాపు నాయ‌కులంతా ఇలాగే ఉన్నారు. కాక‌పోతే కొంద‌రు బ‌య‌ట ప‌డుతున్నారు. మ‌రికొంద‌రు బ‌య‌ట ప‌డడం లేదు. అంతే తేడా. కానీ గ‌తంలో మ‌న దేశానికి ప్ర‌ధానిగా ప‌నిచేసిన ఆ గొప్ప వ్య‌క్తి మాత్రం అలా కాదు. త‌న ప‌ద‌విని, అధికారాన్ని సొంత ప‌నుల కోసం, సొంత వారి కోసం ఏ మాత్రం ఉప‌యోగించుకోలేదు స‌రిక‌దా ఆ ప‌ద‌విలో ఉన్నందుకు త‌న‌కు ఇత‌రులు ఇచ్చే గౌర‌వాన్నే సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు కూడా ఇవ్వాల‌ని ఆదేశించి, ఇప్ప‌టి రాజ‌కీయ నాయ‌కులకు ఆద‌ర్శంగా నిలిచారు. ఆయ‌నే లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి. ఆయ‌న జీవితంలో జ‌రిగిన కొన్ని సంఘ‌ట‌న‌ల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

1965లో భార‌త ప్ర‌ధానిగా ప‌ని చేస్తున్న స‌మ‌యంలో లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి ఫియ‌ట్ కారు కొనేందుకు పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ నుంచి రూ.5వేల లోన్ తీసుకున్నారు. బ్యాంక్ కూడా త్వ‌ర‌గానే లోన్ శాంక్షన్ చేసింది. కాగా ఆయ‌న ఆ లోన్ మొత్తాన్ని చెల్లించ‌కుండానే 1966లో క‌న్ను మూశారు. దీంతో బ్యాంక్ వారు ఆయ‌న స‌తీమ‌ణి ల‌లిత శాస్త్రికి లోన్ చెల్లించాల‌ని లేఖ రాశారు. ఈ క్ర‌మంలో ఆమె ఆ మొత్తాన్ని బ్యాంకుకు వాయిదాల ప‌ద్ధ‌తిలో చెల్లించారు. కాగా ఆ ఫియ‌ట్ కారు శాస్త్రి కుటుంబీకుల ఇంట్లో ఇప్ప‌టికీ ఉంద‌ట‌.

సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో అడ్మిష‌న్ కోసం శాస్త్రి కుమారుడు ద‌ర‌ఖాస్తు చేసుకోగా ఆ అప్లికేష‌న్ ఫాంలో శాస్త్రి త‌న వృత్తిని ‘గ‌వ‌ర్న‌మెంట్ స‌ర్వెంట్’ అని రాసి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. కాగా ఒక రోజు శాస్త్రి కుమారుడు ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్‌లో నిరుద్యోగిగా ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు లైన్‌లో వేచి ఉండ‌గా అక్క‌డి క్ల‌ర్క్ ఒక‌త‌ను శాస్త్రి కుమారుడ్ని ‘మీ తండ్రి ఏం చేస్తాడ‌’ని ప్ర‌శ్నించాడు. అందుకు శాస్త్రి కుమారుడు తన తండ్రి ప్ర‌ధాన మంత్రి అని చెప్ప‌గా అక్క‌డున్న వారంద‌రూ అత‌న్ని చూసి ఆశ్చ‌ర్య‌పోయార‌ట‌. ఇవే కాదు, ఒకానొక సంద‌ర్భంలో ప్ర‌భుత్వ ఉద్యోగిగా ప‌నిచేస్తున్న శాస్త్రి కుమారుడికి అర్హ‌త లేక‌పోయినా ఉద్యోగంలో ప్ర‌మోష‌న్ ఇచ్చార‌ట‌. ఈ విష‌యాన్ని తెలుసుకున్న లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి వెంట‌నే ఆ ప్ర‌మోష‌న్‌ను నిలిపి వేయించాడ‌ట‌.

పైన చెప్పిన సంఘ‌ట‌న‌లు కేవ‌లం కొన్ని ఉదాహ‌ర‌ణ‌లు మాత్ర‌మే. వాటి గురించి తెలుసుకుంటే చాలు లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి, ఆయ‌న కుటుంబ స‌భ్యులు ఎంత నిజాయితీగా, హుందాగా వ్య‌వ‌హ‌రించారో ఇట్టే అర్థ‌మ‌వుతుంది. కేవ‌లం ఈ విష‌యాల్లోనే కాదు శత్రు దేశ‌మైన పాకిస్థాన్‌పై భార‌త సైనికులు విజ‌యం సాధించ‌డం వెనుక కూడా శాస్త్రి ధైర్యం, తెగువ‌, ప్రోత్సాహం ఎంతో ఉంద‌ట‌. శ‌త్రు దేశ సైనికులు దాడి చేస్తే దాన్ని తిప్పికొట్టాల‌ని, ఎట్టి ప‌రిస్థితుల్లోనూ వారికి లొంగ వ‌ద్ద‌ని, శ‌రీరంలో ప్రాణం ఉన్నంత వ‌ర‌కు, చివ‌రి వ‌ర‌కు దేశం కోసం పోరాడాల‌ని శాస్త్రి సైనికుల‌ను ఎప్ప‌టికప్పుడు ప్రేరేపించేవార‌ట‌. నిజంగా ఆయ‌న లాంటి నాయ‌కులు ఇప్పుడు చూద్దామ‌న్నా లేరు క‌దా! ఏది ఏమైనా, రాజ‌కీయ నాయ‌కులు, ప్ర‌జా ప్ర‌తినిధులంటే ప్ర‌జ‌ల‌కు సేవ చేసే వారేన‌ని, వారు స్వార్థం కోసం ప‌నిచేయ‌కూడ‌ద‌ని చాటి చెప్పిన గొప్ప వ్య‌క్తి లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి. ఆయ‌న మ‌న దేశంలో పుట్టి ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు సేవ చేసినందుకు నిజంగా మ‌నం గ‌ర్వ ప‌డాల్సిందే! ఏమంటారు!

సొంతంగా పండించిన పదార్థాలతో భక్తులకు భోజనం పెడుతున్న గుడి.!నేటి ఉరుకుల ప‌రుగుల బిజీ జీవితంలో జంక్ ఫుడ్‌, ఫాస్ట్‌ఫుడ్‌ను ...
06/06/2016

సొంతంగా పండించిన పదార్థాలతో భక్తులకు భోజనం పెడుతున్న గుడి.!
నేటి ఉరుకుల ప‌రుగుల బిజీ జీవితంలో జంక్ ఫుడ్‌, ఫాస్ట్‌ఫుడ్‌ను జ‌నాలు అధికంగా తింటున్నారు. వీటిల్లో ఉండే ర‌సాయ‌నాలు మ‌న‌కు ఏ విధంగా హాని క‌లిగిస్తాయో అంద‌రికీ తెలిసిందే. అయితే కేవ‌లం ఇవే కాకుండా నిత్యం ఇళ్ల‌లో ఆహారం వండేందుకు ఉప‌యోగించే కూర‌గాయ‌లు, ప‌ప్పులు, బియ్యం, ధాన్యాల పిండి వంటి ప‌దార్థాల్లో కూడా ర‌సాయ‌న అవ‌శేషాలు మిగిలే ఉంటున్నాయి. వీటి వ‌ల్ల కూడా దీర్ఘ‌కాలికంగా మ‌న‌కు అనేక ర‌కాల అనారోగ్యాలు సంభ‌విస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే అత్యంత స‌హ‌జ సిద్ధంగా ఆర్గానిక్ ప‌ద్ధ‌తిలో పండిన ప‌దార్థాల‌తో త‌యారు చేసిన వంట‌కాల‌ను తిన‌డం మ‌న‌కు ఇప్పుడు అత్యంత ఆవ‌శ్య‌కంగా మారింది. స‌రిగ్గా ఇదే విష‌యాన్ని గుర్తించిన అమృత్‌స‌ర్‌లోని గోల్డెన్ టెంపుల్ ఆల‌య క‌మిటీ వారు స‌హజ సిద్ధంగా పండిన కూర‌గాయ‌ల‌ను వంట‌ల కోసం ఉప‌యోగిస్తున్నారు. క్రిమి సంహార‌క మందులు ఏవీ వాడ‌కుండానే ఆర్గానిక్ ప‌ద్ధ‌తిలో పండిన కూర‌గాయ‌లు, ధాన్యాల‌తో వండిన ఆహారాన్ని టెంపుల్ సంద‌ర్శ‌కుల‌కు అతి త్వ‌ర‌లో అందించ‌నున్నారు.
సిఖ్ వ‌ర్గీయుల‌కు చెందిన శిరోమ‌ణి గురుద్వారా ప‌ర్బంధ‌క్ క‌మిటీ (ఎస్‌జీపీసీ) పంజాబ్‌తోపాటు, హ‌ర్యానా, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌ల‌లో ఉండే అన్ని గురుద్వారాల‌ను పర్య‌వేక్షిస్తుంది. ఇదే క‌మిటీ అమృత్‌స‌ర్‌లోని గోల్డెన్ టెంపుల్ బాధ్య‌త‌ల‌ను కూడా చూస్తుంది. అయితే ఈ క‌మిటీ ఇటీవ‌లే ఓ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుని అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. ర‌సాయ‌నాల‌కు దూరంగా అత్యంత స‌హ‌జ సిద్ధ‌మైన ప‌ద్ధ‌తిలో ధాన్యాలు, పండ్లు, కూర‌గాయ‌ల‌ను స్వ‌యంగా పండించాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. ఇలా పండిన ప‌దార్థాల‌తో ఆరోగ్య‌క‌రమైన భోజ‌నాన్ని సంద‌ర్శ‌కుల‌కు అందించాల‌ని సంక‌ల్పించింది. దీంతో అనుకున్న‌దే త‌డ‌వుగా గురుద్వారా గురుస‌ర్ స‌త్లానీ సాహిబ్‌, ప‌టియాలాల‌లో ఇప్ప‌టికే దాదాపు 40 ఎక‌రాల విస్తీర్ణంలో పూర్తి ఆర్గానిక్ ప‌ద్ధ‌తిలో కూర‌గాయ‌లు, పండ్ల‌ను ఎస్‌జీపీసీ పండిస్తోంది.
ఈ వ్య‌వ‌సాయ క్షేత్రాల్లో మొద‌టి ద‌శ‌లో భాగంగా క్యారెట్లు, క్యాబేజీ, పాల‌కూర‌, మెంతి ఆకుల‌ను పండిస్తున్నారు. దాదాపు 10 క్వింటాళ్ల‌కు పైగా ఆహార ప‌దార్థాల‌ను ప్ర‌తి 2 రోజుల‌కు ఒక‌సారి గోల్డెన్ టెంపుల్ గురుద్వారాకు పంపనున్నామ‌ని ఎస్‌జీపీసీ అధికారులు తెలియ‌జేశారు. కాగా పంజాబ్ ఆగ్రో ఇండ‌స్ట్రీస్ కార్పొరేష‌న్ లిమిటెడ్ (పీఏఐసీ) వారు ఎస్‌జీపీసీకి త‌మ వంతు స‌హాయ స‌హ‌కారాల‌ను అందిస్తున్నారు. వ్య‌వ‌సాయ క్షేత్రాల్లో మ‌ట్టి ప‌రీక్ష‌లు చేయ‌డం, కృత్రిమ క్రిమి సంహార‌కాల‌కు బ‌దులుగా ఆర్గానిక్ ప‌ద్ధ‌తిలో ఎలా వ్య‌వ‌సాయం చేయాలి, స‌హ‌జ సిద్ధ‌మైన పురుగు మందుల‌ను ఎలా త‌యారు చేయాలి, వాడాలి అనే అంశాల ప‌ట్ల ఎస్‌జీపీసీ వారికి అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే పీఏఐసీ వారు వేప ఆకు, ఆవు మూత్రం వంటి స‌హ‌జ సిద్ధ‌మైన ప‌దార్థాల‌తో ఎరువుల‌ను త‌యారు చేయ‌డంపై కూడా అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు. అయితే గోల్డెన్ టెంపుల్ క‌మిటీ వారు తాము పండించ‌డ‌మే కాదు స్థానిక రైతుల‌ను కూడా ఆర్గానిక్ వ్య‌వ‌సాయం ప‌ట్ల ప్రోత్స‌హిస్తున్నారు. ర‌సాయ‌నాల వాడ‌కాన్ని క్ర‌మంగా త‌గ్గించాల‌ని చెబుతూ రైతుల‌కు స‌హ‌జ సిద్ధ‌మైన ఆర్గానిక్ వ్య‌వ‌సాయం ప‌ట్ల అవ‌గాహ‌న పెంచుతున్నారు.
కాగా అమృత్‌స‌ర్‌లోని గోల్డెన్ టెంపుల్ గురుద్వారా ప్ర‌పంచంలోనే అత్యంత పెద్ద వంట‌శాల‌గా ఇప్ప‌టికే రికార్డు సృష్టించింది. అక్క‌డ కుల‌, మ‌త‌, వ‌ర్గ‌, ప్రాంత భేదాలు లేకుండా నిత్యం ల‌క్ష మందికి పైగా సంద‌ర్శ‌కుల‌కు ఉచితంగా భోజ‌నం వడ్డిస్తున్నారు. ఇందుకోసం వారికి నిత్యం 7వేల కిలోల గోధుమ పిండి అవ‌స‌ర‌మవుతోంది. దీంతోవారు దాదాపు 2 ల‌క్ష‌ల‌కు పైగా చ‌పాతీలు చేస్తారు. అదేవిధంగా 1200 కిలోల బియ్యం, 1300 కిలోల ప‌ప్పుల‌తో ఆహార ప‌దార్థాల‌ను వండుతారు. ఇందు కోసం 450 మంది సిబ్బందితోపాటు స్వ‌చ్ఛందంగా ప‌లువురు వాలంటీర్లు కూడా సేవ‌లందిస్తుంటారు. కాగా గోల్డెన్ టెంపుల్‌లో స‌హ‌జ సిద్ధ‌మైన, ఆరోగ్య‌క‌ర భోజ‌నాన్ని అందించాల‌నే ఈ నిర్ణ‌యాన్ని దేశ‌వ్యాప్తంగా ఉన్న మిగ‌తా గురుద్వారాల‌లోనూ అనుస‌రించేలా ఎస్‌జీపీసీ అధికారులు స‌న్నాహాలు చేస్తున్నారు. అదే అమ‌లైతే ఇక‌పై అన్ని గురుద్వారాల్లో స్వ‌చ్ఛ‌మైన ఆహారం దొరుకుతుంద‌న్న‌మాట‌!
నేటి ఉరుకుల ప‌రుగుల బిజీ జీవితంలో జంక్ ఫుడ్‌, ఫాస్ట్‌ఫుడ్‌ను జ‌నాలు అధికంగా తింటున్నారు. వీటిల్లో ఉండే ర‌సాయ‌నాలు మ‌న‌కు ఏ విధంగా హాని క‌లిగిస్తాయో అంద‌రికీ తెలిసిందే. అయితే కేవ‌లం ఇవే కాకుండా నిత్యం ఇళ్ల‌లో ఆహారం వండేందుకు ఉప‌యోగించే కూర‌గాయ‌లు, ప‌ప్పులు, బియ్యం, ధాన్యాల పిండి వంటి ప‌దార్థాల్లో కూడా ర‌సాయ‌న అవ‌శేషాలు మిగిలే ఉంటున్నాయి. వీటి వ‌ల్ల కూడా దీర్ఘ‌కాలికంగా మ‌న‌కు అనేక ర‌కాల అనారోగ్యాలు సంభ‌విస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే అత్యంత స‌హ‌జ సిద్ధంగా ఆర్గానిక్ ప‌ద్ధ‌తిలో పండిన ప‌దార్థాల‌తో త‌యారు చేసిన వంట‌కాల‌ను తిన‌డం మ‌న‌కు ఇప్పుడు అత్యంత ఆవ‌శ్య‌కంగా మారింది. స‌రిగ్గా ఇదే విష‌యాన్ని గుర్తించిన అమృత్‌స‌ర్‌లోని గోల్డెన్ టెంపుల్ ఆల‌య క‌మిటీ వారు స‌హజ సిద్ధంగా పండిన కూర‌గాయ‌ల‌ను వంట‌ల కోసం ఉప‌యోగిస్తున్నారు. క్రిమి సంహార‌క మందులు ఏవీ వాడ‌కుండానే ఆర్గానిక్ ప‌ద్ధ‌తిలో పండిన కూర‌గాయ‌లు, ధాన్యాల‌తో వండిన ఆహారాన్ని టెంపుల్ సంద‌ర్శ‌కుల‌కు అతి త్వ‌ర‌లో అందించ‌నున్నారు.
సిఖ్ వ‌ర్గీయుల‌కు చెందిన శిరోమ‌ణి గురుద్వారా ప‌ర్బంధ‌క్ క‌మిటీ (ఎస్‌జీపీసీ) పంజాబ్‌తోపాటు, హ‌ర్యానా, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌ల‌లో ఉండే అన్ని గురుద్వారాల‌ను పర్య‌వేక్షిస్తుంది. ఇదే క‌మిటీ అమృత్‌స‌ర్‌లోని గోల్డెన్ టెంపుల్ బాధ్య‌త‌ల‌ను కూడా చూస్తుంది. అయితే ఈ క‌మిటీ ఇటీవ‌లే ఓ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుని అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. ర‌సాయ‌నాల‌కు దూరంగా అత్యంత స‌హ‌జ సిద్ధ‌మైన ప‌ద్ధ‌తిలో ధాన్యాలు, పండ్లు, కూర‌గాయ‌ల‌ను స్వ‌యంగా పండించాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. ఇలా పండిన ప‌దార్థాల‌తో ఆరోగ్య‌క‌రమైన భోజ‌నాన్ని సంద‌ర్శ‌కుల‌కు అందించాల‌ని సంక‌ల్పించింది. దీంతో అనుకున్న‌దే త‌డ‌వుగా గురుద్వారా గురుస‌ర్ స‌త్లానీ సాహిబ్‌, ప‌టియాలాల‌లో ఇప్ప‌టికే దాదాపు 40 ఎక‌రాల విస్తీర్ణంలో పూర్తి ఆర్గానిక్ ప‌ద్ధ‌తిలో కూర‌గాయ‌లు, పండ్ల‌ను ఎస్‌జీపీసీ పండిస్తోంది.
ఈ వ్య‌వ‌సాయ క్షేత్రాల్లో మొద‌టి ద‌శ‌లో భాగంగా క్యారెట్లు, క్యాబేజీ, పాల‌కూర‌, మెంతి ఆకుల‌ను పండిస్తున్నారు. దాదాపు 10 క్వింటాళ్ల‌కు పైగా ఆహార ప‌దార్థాల‌ను ప్ర‌తి 2 రోజుల‌కు ఒక‌సారి గోల్డెన్ టెంపుల్ గురుద్వారాకు పంపనున్నామ‌ని ఎస్‌జీపీసీ అధికారులు తెలియ‌జేశారు. కాగా పంజాబ్ ఆగ్రో ఇండ‌స్ట్రీస్ కార్పొరేష‌న్ లిమిటెడ్ (పీఏఐసీ) వారు ఎస్‌జీపీసీకి త‌మ వంతు స‌హాయ స‌హ‌కారాల‌ను అందిస్తున్నారు. వ్య‌వ‌సాయ క్షేత్రాల్లో మ‌ట్టి ప‌రీక్ష‌లు చేయ‌డం, కృత్రిమ క్రిమి సంహార‌కాల‌కు బ‌దులుగా ఆర్గానిక్ ప‌ద్ధ‌తిలో ఎలా వ్య‌వ‌సాయం చేయాలి, స‌హ‌జ సిద్ధ‌మైన పురుగు మందుల‌ను ఎలా త‌యారు చేయాలి, వాడాలి అనే అంశాల ప‌ట్ల ఎస్‌జీపీసీ వారికి అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే పీఏఐసీ వారు వేప ఆకు, ఆవు మూత్రం వంటి స‌హ‌జ సిద్ధ‌మైన ప‌దార్థాల‌తో ఎరువుల‌ను త‌యారు చేయ‌డంపై కూడా అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు. అయితే గోల్డెన్ టెంపుల్ క‌మిటీ వారు తాము పండించ‌డ‌మే కాదు స్థానిక రైతుల‌ను కూడా ఆర్గానిక్ వ్య‌వ‌సాయం ప‌ట్ల ప్రోత్స‌హిస్తున్నారు. ర‌సాయ‌నాల వాడ‌కాన్ని క్ర‌మంగా త‌గ్గించాల‌ని చెబుతూ రైతుల‌కు స‌హ‌జ సిద్ధ‌మైన ఆర్గానిక్ వ్య‌వ‌సాయం ప‌ట్ల అవ‌గాహ‌న పెంచుతున్నారు.
కాగా అమృత్‌స‌ర్‌లోని గోల్డెన్ టెంపుల్ గురుద్వారా ప్ర‌పంచంలోనే అత్యంత పెద్ద వంట‌శాల‌గా ఇప్ప‌టికే రికార్డు సృష్టించింది. అక్క‌డ కుల‌, మ‌త‌, వ‌ర్గ‌, ప్రాంత భేదాలు లేకుండా నిత్యం ల‌క్ష మందికి పైగా సంద‌ర్శ‌కుల‌కు ఉచితంగా భోజ‌నం వడ్డిస్తున్నారు. ఇందుకోసం వారికి నిత్యం 7వేల కిలోల గోధుమ పిండి అవ‌స‌ర‌మవుతోంది. దీంతోవారు దాదాపు 2 ల‌క్ష‌ల‌కు పైగా చ‌పాతీలు చేస్తారు. అదేవిధంగా 1200 కిలోల బియ్యం, 1300 కిలోల ప‌ప్పుల‌తో ఆహార ప‌దార్థాల‌ను వండుతారు. ఇందు కోసం 450 మంది సిబ్బందితోపాటు స్వ‌చ్ఛందంగా ప‌లువురు వాలంటీర్లు కూడా సేవ‌లందిస్తుంటారు. కాగా గోల్డెన్ టెంపుల్‌లో స‌హ‌జ సిద్ధ‌మైన, ఆరోగ్య‌క‌ర భోజ‌నాన్ని అందించాల‌నే ఈ నిర్ణ‌యాన్ని దేశ‌వ్యాప్తంగా ఉన్న మిగ‌తా గురుద్వారాల‌లోనూ అనుస‌రించేలా ఎస్‌జీపీసీ అధికారులు స‌న్నాహాలు చేస్తున్నారు. అదే అమ‌లైతే ఇక‌పై అన్ని గురుద్వారాల్లో స్వ‌చ్ఛ‌మైన ఆహారం దొరుకుతుంద‌న్న‌మాట‌!

ఉపవాసం ఉండడం మంచిదేనా? పాస్టింగ్ వల్ల కలిగే లాభాలేంటి?రంజాన్ మాసం వచ్చేసింది. ముస్లీం సోదరులంతా భక్తిశ్రద్దలతో ఈ పవిత్రమ...
06/06/2016

ఉపవాసం ఉండడం మంచిదేనా? పాస్టింగ్ వల్ల కలిగే లాభాలేంటి?

రంజాన్ మాసం వచ్చేసింది. ముస్లీం సోదరులంతా భక్తిశ్రద్దలతో ఈ పవిత్రమాసానా….నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలను చేపడతారు. హిందూ సోదరులు కూడా వారంలో ఒకరోజును దేవుడి కొరకు అర్పిస్తూనో.. శివరాత్రి రోజో ఉపవాసదీక్షలు చేపడతారు.. అయితే నిజంగా ఇలా ఉపవాసాలు ఉండడం మంచిదేనా? అంటే, మంచిదే అని సైన్స్ చెబుతోంది. అది ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉపవాస అనేది సంస్కృత పదం. ఉప అంటే దగ్గర అని, వాస అంటే ఉండడం అని అర్థం. వెరసి ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా ఉండడం. ఒకప్పుడు ప్రజలు ఆహారాన్ని సంపాదించడం, దాన్ని వండుకోవడం, తినడం, జీర్ణం చేసుకోవడం వంటి అంశాల పట్ల ఎక్కువగా దృష్టి సారించేవారు. ఈ నేపథ్యంలోనే వారు శారీరకంగా అలసిపోవడంతోపాటు మానసిక ఏకాగ్రత ఉండేది కాదు. దీన్ని అధిగమించేందుకే వారు తక్కువ మొత్తంలో తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం లేదా అసలు ఆహారానికే దూరంగా ఉండడమో చేసే వారు. దీంతో శరీరం తేలిగ్గా అనిపించి మనసు కూడా ప్రశాంతమయ్యేది. దేవుడికి పూజలు, ప్రార్థనలు చేసేందుకు ఇది వారికి ఎంతగానో ఉపయోగపడేది.
ఆహారం తినకుండా అప్పుడప్పుడూ ఉపవాసం చేస్తే జీర్ణవ్యవస్థ శుభ్రమవుతుంది. దీంతోపాటు శరీరంలోని ఇతర అవయవాలు కూడా మెరుగ్గా పనిచేసేందుకు వీలవుతుంది. ఇది శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది.ఉపవాసంపై భగవద్గీతలో కూడా పలు అంశాలు పేర్కొనబడ్డాయి. ఉపవాసం అనేది ఒక వ్యక్తి పూర్తి ఇష్టంతోనే ఉండాలని, ఎవరూ ఈ విషయంలో బలవంతం చేయవద్దని గీత సారాంశం. అంతేకాదు శరీరం మరీ నీరసించి అనారోగ్యం కలిగేంతలా కూడా ఉపవాసం చేయకూడదు. ఉపవాసంలో ఉన్నప్పుడే కాకుండా లేనప్పుడు కూడా తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం మాత్రమే తీసుకోవాలి.
అందుకే పెద్దల లంకణం పరమౌషదం అంటారు.

రోజా( ఉపవాసం) విషయంలో కొన్ని సూచనలు:
ఎండలు మండిపోతున్న ఈ తరుణంలో మద్యాహ్నం సమయంలో ఎండలకు దూరంగా ఉండాలి.
శరీరానికి అవసరమయ్యే పోషకాల గురించి తెలుసుకోని తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
ఉపవాసం విడవగానే..తేలికగా జీర్ణమయ్యే ఆహారపదార్థాలను తీసుకోవాలి.
మసాలాలు, నాన్-వెజ్ లను ఎక్కువగా తీసుకోకూడదు.
పండ్లను అధిక స్థాయిలో తీసుకోవాలి.
బిపీ, షుగర్ లాంటి వ్యాధులన్న వారు డాక్టర్లను సంప్రదించి వారి అనుమతి తో రోజాను పాటిస్తే మంచిది.

దిష్టి మంత్రం ఎలా పనిచేస్తుందో తెలుసా? తెలిస్తే… ఆశ్చర్యపోతారు.పిల్లాడికి దిష్టి తగిలినట్టుంది. ఒకటే వాంతులవుతున్నాయి. ఉ...
06/06/2016

దిష్టి మంత్రం ఎలా పనిచేస్తుందో తెలుసా? తెలిస్తే… ఆశ్చర్యపోతారు.

పిల్లాడికి దిష్టి తగిలినట్టుంది. ఒకటే వాంతులవుతున్నాయి. ఉదయం నుండి ఏమీ తినలేదు. కడుపు ఉబ్బరంగా ఉందంట… కాస్త దిష్టి మంత్రం వేయ్యి పెద్దమ్మా..అంటూ ఇప్పటికీ ఊర్లల్లో చాలా మంది దిష్టి మంత్రం వచ్చిన వారి దగ్గరికి వెళతారు.అప్పుడు వారు ..చేతిలోకి కొంత పంచదారో..ఉప్పో తీసుకొని…లోలోపల మంత్రాలు చదివి. త్పూ…త్పూ…థూ…అంటూ ఉమ్మినట్టు చేసి వారి చేతికిచ్చి..మీ అబ్బాయికిచ్చి తినమని చెప్పండి. దిష్టి తగ్గిపోతోంది అంటారు. అమ్మ వచ్చి అలా చేయగానే…ఆ కుర్రాడికి కాస్త ఉపశమనంగా అనిపిస్తుంది. కుర్రాడు కాసింత తేరుకోగానే..దిష్టిమంత్రం పనిచేసిందని తెగ ఆనందపడిపోతుంది అమ్మ….అయితే ఇప్పుడు దిష్టి మంత్రం ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం.

దిష్టి తగిలింది అనే వ్యక్తి యొక్క లక్షణాలు ఏంటంటే..కడుపు ఉబ్బరంగా మారడం. అజీర్తి వల్ల కడుపు నొప్పి రావడం. దీనికి కారణం..జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పట్టే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడమో? లేక నూనె పదార్థాలు ఎక్కువ తీసుకోవడమో . వీటి వల్ల కడుపులో నొప్పి వస్తుంది. దానినే మనవాళ్లు దిష్టి తగిలింది అంటారు. ఇప్పుడు మంత్రం విషయానికి వద్దాం… థూ…థూ ..థూ అని మంత్రసాని మన చేతికిచ్చేది….. పంచదార/ ఉప్పు… వీటిని సదరు వ్యక్తి తినేటప్పుడు…అతడిలోని లాలాజల గ్రంధులు అధిక లాలాజలాన్ని స్రవిస్తాయి. అధిక లాలాజలం కడుపులో పడి ఉన్న ఆహారం పై రెట్టింపు చర్య జరిపి దానిని జీర్ణమయ్యేలా చేస్తుంది. అందుకే కడుపు ఫ్రీ అవుతుంది.

మంత్రం చదవకుండా…ఇచ్చినప్పటికి పంచదార/ఉప్పులకు ఆ శక్తి ఉంటుంది. ఆ స్థానంలో చింతపండు/ నిమ్మకాయలు అయితే ఇంకా ఎక్కువగా పనిచేస్తాయి. ఈ సారి దిష్టి తగిలిందనే ఫీలింగ్ లో ఉంటే ఓ గ్లాస్ నిమ్మరసం లో ఉప్పు పంచదార కలిపి తాగండి. కడుపు దెబ్బకు ఫ్రీ అవుతుంది.

భారతీయులకు నమ్మకాల పట్ల అధిక విశ్వాసం ఉండడం చేత సైన్స్ ను నమ్మకాలతో మిళితం చేసిన వైద్యాలు మన దేశంలో అనేకం ఉంటాయి. మన ప్రతి ఆచార సాంప్రదాయాలో సైన్స్ దాగి ఉంటుంది. దానిని పట్టుకోగలిగితే..వైద్య శాస్త్రంలో అద్భుతాలు సృష్టించవచ్చు.

RTC డ్రైవర్లు ఇలా చేయడం ఎంత వరకు కరెక్టో మీరే చెప్పండి.!హాయ్,  మాది సూర్యాపేట… ఉద్యోగరీత్యా హైద్రాబాద్ లో ఉంటున్నాను. మొ...
06/06/2016

RTC డ్రైవర్లు ఇలా చేయడం ఎంత వరకు కరెక్టో మీరే చెప్పండి.!

హాయ్, మాది సూర్యాపేట… ఉద్యోగరీత్యా హైద్రాబాద్ లో ఉంటున్నాను. మొన్న ఓ అత్యవసర పనుండి హైద్రాబాద్ నుండి సూర్యాపేటకు RTC బస్ లో బయలుదేరాను. LB నగర్ సర్కిల్ దగ్గర రాత్రి 10: 30 నిమిషాలకు బస్ ఎక్కాను…బస్ దూసుకుపోతుంది. అంతలోనే ఇంటి నుండి ఫోన్..ఆ అమ్మ నేను బస్ ఎక్కాను 12:30 వరకు అక్కడుంటా…అని చెప్పేసి నిద్రలోకి జారుకున్న….అంతలోనే డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు..హా…బస్ కాసేపు ఆగుతుంది డిన్నర్ టైమ్ అని చెప్పేసి దిగాడు. అదేంటి అని కిందికి దిగి చూశాను. అది రామోజీ ఫిల్మ్ సిటీ దాటిన 30 కిలోమీటర్ల తర్వాత ఉన్న రోడ్ సైడ్ హోటల్ అది. అక్కడ బస్ ను ఆపాడు.

ఇతనొక్కడే ఆపాడనుకుంటూ పొరపాటే…వరుసగా RTC బస్ లు వచ్చి ఆ హోటల్ దగ్గర ఆగుతున్నాయి. ఓ టీ తాగాని నేను అక్కడున్న బస్ లను నా ఫోన్ తో ఫోటో తీసుకున్న.. ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు రేజ్ చేస్తా అవునా? కాదా ? మీరే చెప్పండి.

బ్రేక్ ఫాస్ట్, లంచ్,డిన్నర్ ఏదైనా కానీ…. RTC బస్ లను బస్టాప్ లలో తప్ప, బయట ఆపకూడదనే రూల్ ఉందా? లేదా? ఉంటే అది ఈ డ్రైవర్లకు పట్టదా?
ఇలా ప్రైవేట్ హోటల్స్ ముందు ఆపితే…RTC డ్రైవర్ & కండక్టర్లకు సదరు హోటల్ యాజమాన్యం ఫ్రీగా భోజనాన్ని అందిస్తుంది..అంటే వారి ఫ్రీ భోజనం కోసం బస్ ను ఎక్కడ పడితే అక్కడ ఆపుతారా?

బస్ ఆపినప్పుడు ఎలాగో బస్ ఆగింది కదా అని అందులోని ప్రయాణికులు చెట్లచాటుకో…రోడ్డు దాటో టాయిలెట్స్ వెళతారు. ఆ సమయంలో యాక్సిడెంట్ కారణంగానో, పాము కాటు కారణంగానో ఎవరైనా మరణిస్తే దానికి బాధ్యత ఎవరు?

ఇలా బయటి హోటల్స్ ముందు ఆపడం వల్ల 3 గంటల నా జర్నీకి 3 గంటల 45 నిమిషాలకు పైగా పట్టింది. నాకు అంత అర్జెంట్ లేదు కాబట్టి ప్రాబ్లమ్ లేదు..మరీ అర్జంట్ అయిన వారి పరిస్థితి ఏంటి?
అయినా 10 దాటిన తర్వాత డిన్నర్ ఏంటి?
ఇది ఎంత వరకు కరెక్ట్?

ఒకసారి రాముడు ఏదో ముఖ్యమైన చర్చలో ఉంటాడు. ఆ సయమంలో ఎవరినీ లోపలికి అనుమతించకండని, లోపల చర్చ జరుగుతుందని ఆదేశిస్తాడు. ఒకవే...
06/06/2016

ఒకసారి రాముడు ఏదో ముఖ్యమైన చర్చలో ఉంటాడు. ఆ సయమంలో ఎవరినీ లోపలికి అనుమతించకండని, లోపల చర్చ జరుగుతుందని ఆదేశిస్తాడు. ఒకవేళ తన ఆజ్ఞను లెక్కచేయక, ఎవరినైనా లోపలికి అనుమతిస్తే.. ఆ వ్యక్తిని చంపేస్తానని రాముడు హెచ్చరిస్తాడు.

అప్పుడు అక్కడికి దుర్వాస మహర్షి ఏదో పనిమీద వచ్చి రాముడిని కలవాలనుకుంటాడు. అన్నమాటే వేదంగా భావించే లక్ష్మణుడు అతన్ని లోపలికి అనుమతించడు. తనను లోపలికి అనుమతించకపోతే.. అయోధ్యను అగ్నికి ఆహుతి చేస్తానని మహర్షి హెచ్చరించడంతో, రాజ్యక్షేమం కోసం లక్ష్మణుడు దుర్వాస మహర్షిని లోపలికి అనుమతిస్తాడు.

కోపానికి గురైన రాముడు.. దుర్వాస మహర్షిని ఎవరు లోపలికి అనుమతించారని బయటకు వచ్చి చూస్తాడు. లక్ష్మణుడని గుర్తించేలోపే, లక్ష్మణుడు తాను అన్న మాట తప్పానని భావించి, పక్కనే ఉన్న సరయు నదిలో దూకి తన జీవితం ముగించుకుంటాడు. తన సోదరుని మరణం చూసి భరించలేకపోయిన రాముడు కూడా వెంటనే అదే నదిలో దూకి చనిపోతాడు.

చేతి వేలి గోరుపై అర్ధ చంద్రాకారంలో ఉండే షేప్‌ను మీరెప్పుడైనా గ‌మనించారా? దాని అర్థ‌మేమిటో, దాంతో ఏం జ‌రుగుతుందో తెలుసుకో...
03/06/2016

చేతి వేలి గోరుపై అర్ధ చంద్రాకారంలో ఉండే షేప్‌ను మీరెప్పుడైనా గ‌మనించారా? దాని అర్థ‌మేమిటో, దాంతో ఏం జ‌రుగుతుందో తెలుసుకోండి..!

నిత్యం మ‌నం మ‌న చుట్టూ ఉన్న ప‌రిస‌రాల్లో ఒక్కోసారి చిత్ర‌మైన ఆకారాల‌ను చూస్తుంటాం. ఆకాశంలోని మ‌బ్బుల్లో మ‌నుషులు, దేవుళ్లు, చెట్లు త‌దిత‌రాల‌ను పోలిన ఆకారాల‌ను, నీళ్లు, మ‌ట్టి, రాళ్లు, వృక్షాలు, ఆకులలో అప్పుడప్పుడు యాదృచ్ఛికంగా క‌నిపించే ఆకృతుల‌ను మనం చూసి ఆశ్చ‌ర్యం చెందుతుంటాం. తాత్కాలికంగా ఏర్ప‌డిన ఆకృతులే అయినా వాటిని చూస్తే మ‌న‌కు వింత‌గా అనిపిస్తుంది. కానీ మ‌న శ‌రీరంలోనూ అలాంటి ఆకృతులు ఉంటాయ‌ని మీకు తెలుసా? అవును, నిజంగానే ఉంటాయి. వాటిలో గోర్లు కూడా ఒక‌టి. ఇంత‌కీ వాటిపై ఏం ఆకారం ఉంటుంది? దాంతో ఏం జ‌రుగుతుంది, అనేగా మీ డౌట్‌. అయితే దాన్ని తీర్చుకుందాం ప‌దండి.

చేతి వేలి గోర్ల‌పై కింది వైపుకు ఉండే భాగంలో అర్ధ‌చంద్రాకారంలో నెల‌వంక‌ను పోలిన ఓ ఆకారం ఉంటుంది. దాన్ని మీరు ఎప్పుడైనా గ‌మ‌నించారా? గ‌మ‌నించే ఉంటారు లెండి. కానీ దాని గురించి మీకు తెలిసి ఉండ‌దు. కాగా ఆ ఆకారాన్ని ‘లునులా (lunula)’ అని పిలుస్తారు. ఈ లునులా మ‌న శ‌రీరంలోని అత్యంత సున్నిత‌మైన భాగాల్లో ఒక‌టిగా చెప్ప‌బ‌డుతోంది. లునులా అంటే లాటిన్ భాష‌లో స్మాల్ మూన్ అని అర్థం. అంటే నెల‌వెంక, చంద్ర‌వంక అన్న‌మాట‌. అయితే ఈ లునులా దెబ్బ‌తింటే మాత్రం ఆ గోరు పూర్తిగా నాశ‌న‌మ‌వుతుంద‌ట‌. ఒక వేళ ఏదైనా గోరును స‌ర్జ‌రీ చేసి తీసేసినా లునులా మాత్రం దెబ్బ‌తిన‌ద‌ట‌. అది ఎంత కాల‌మైనా అలాగే ఉంటుంద‌ట‌. ఈ క్ర‌మంలో లునులా ఉండే ఆకారాన్ని, రంగును బ‌ట్టి మ‌నం ఎదుర్కొంటున్న ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కూడా సుల‌భంగా తెలుసుకోవచ్చ‌ట‌. అవేమిటో ఇప్పుడు చూద్దాం.

వేలి గోరుపై లునులా అస‌లు లేక‌పోతే వారు రక్త‌హీన‌త‌, పౌష్టికాహార లోపం వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నార‌ని తెలుసుకోవాలి.
ఒక‌వేళ లునులా రంగు నీలం లేదా పూర్తిగా తెలుపులో పాలి పోయి ఉంటే వారికి డ‌యాబెటిస్ రాబోతుంద‌ని అర్థం చేసుకోవాలి.
లునులా మీద ఎరుపు రంగులో మ‌చ్చ‌లు ఉంటే వారికి గుండె సంబంధ వ్యాధులు ఉన్నాయ‌ని తెలుస్తుంది.
లునులా ఆకారం మ‌రీ చిన్న‌గా, గుర్తు ప‌ట్ట‌లేనంత‌గా ఉంటే వారు అజీర్ణంతో బాధ‌ప‌డుతున్నార‌ని, వారి శ‌రీరంలో విష, వ్య‌ర్థ పదార్థాలు ఎక్కువ‌గా పేరుకుపోయాయ‌ని తెలుసుకోవాలి.

ఇక చివ‌రిగా మ‌రో విష‌యం. అయితే ఆరోగ్యానికి సంబంధించింది కాదు. అలంక‌ర‌ణ‌కు చెందిన‌ది. గోరుపై నెయిల్ పెయింట్ వేసుకునే వారు పూర్తిగా ఒకే క‌ల‌ర్ కాకుండా లునులా వ‌ర‌కు వేరే క‌ల‌ర్ వేసుకుంటే బాగా ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తుంద‌ట‌.

బీర్ తాగ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎలాంటి ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసుకోండి..!హాట్ హాట్‌గా ఉన్న వాతావ‌ర‌ణంలో ...
03/06/2016

బీర్ తాగ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎలాంటి ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసుకోండి..!

హాట్ హాట్‌గా ఉన్న వాతావ‌ర‌ణంలో ఒక చ‌ల్ల‌ని బీర్ కొడితే ఎలా ఉంటుంది? ఆ మ‌జాయే వేరు క‌దా! అవును, మ‌రి. మ‌జాగానే ఉంటుంది. అయితే దాని టేస్ట్ తెలిసిన వారికే ఆ మ‌జా అందుతుంది. లేదంటే అంద‌దు. అంటే డ్రింకింగ్‌ అల‌వాటు ఉన్న‌వారైతేనే బీర్ టేస్ట్‌ను ఎంజాయ్ చేయ‌గ‌లుగుతార‌ని అర్థం. కానీ మోతాదుకు మించి తాగితే బీర్‌తోనూ అన‌ర్థాలు త‌ప్ప‌వు. హ్యాంగోవ‌ర్ మొద‌లు కొని లివ‌ర్ చెడిపోవ‌డం, హార్ట్ స‌మ‌స్య‌లు, క్యాన్స‌ర్ వంటివి వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. అయితే ఆరోగ్యంగా ఉన్న మ‌గ లేదా ఆడ మ‌నిషి రోజుకు 12 ఔన్సుల (దాదాపు 350 ఎంఎల్‌) మోతాదులో బీర్ తాగితే దాంతో ఎన్నో ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ట‌. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
గుండె జ‌బ్బులు…
బీర్‌లో పాలీఫినాల్స్ అన‌బ‌డే ప‌వ‌ర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి గుండె సంబంధ వ్యాధులు రాకుండా కాపాడుతాయి. బీర్‌ను త‌గిన మోతాదులో సేవిస్తే చెడు కొలెస్ట్రాల్ త‌గ్గ‌డంతోపాటు మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీంతోపాటు బీర్ ర‌క్త నాళాల‌ను గ‌ట్టి ప‌డ‌కుండా చూస్తుంది. ర‌క్తం గడ్డ‌క‌ట్ట‌కుండా కాపాడుతుంది. దీని వ‌ల్ల హార్ట్ ఎటాక్స్ వంటివి వ‌చ్చేందుకు అవ‌కాశం త‌క్కువ‌గా ఉంటుంది. హార్వ‌ర్డ్ స్కూల్ ఆఫ్ ప‌బ్లిక్ హెల్త్ వారు చేసిన ప‌రిశోధ‌న‌ల ప్ర‌కారం బీర్‌ను త‌గిన మోతాదులో నిత్యం తీసుకుంటే గుండె సంబంధ స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశం 20 నుంచి 40 శాతం వ‌ర‌కు త‌గ్గుతుందట‌.

కిడ్నీల్లో రాళ్లు…
బీర్‌ను త‌ర‌చూ తాగుతుంటే కిడ్నీల‌లో రాళ్లు ఏర్ప‌డే అవ‌కాశం కూడా త‌గ్గుతుంద‌ట‌. ఫిన్‌లాండ్ యూనివ‌ర్సిటీ ప‌రిశోధ‌కులు చేసిన ప్ర‌యోగాల్లో ఈ విష‌యం వెల్ల‌డైంది. అంతేకాకుండా శ‌రీరంలోని విష ప‌దార్థాలు కూడా బ‌య‌టికి వెళ్లిపోతాయ‌ట‌. ప్ర‌ధానంగా కాల్షియం పేరుకుపోవ‌డం వ‌ల్ల ఏర్ప‌డే కిడ్నీ రాళ్ల‌ను అడ్డుకోవ‌డంలో బీర్ ముఖ్య పాత్ర పోషిస్తుంద‌ట‌.

జ్ఞాప‌క‌శక్తికి…
రష్ యూనివ‌ర్సిటీ మెడిక‌ల్ సెంట‌ర్ వారు చేసిన ప‌రిశోధ‌న‌ల ప్ర‌కారం త‌ర‌చూ బీర్ తాగుతుంటే జ్ఞాప‌క‌శ‌క్తి సంబంధిత స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశాలు 23 శాతం వ‌రకు తగ్గుతాయ‌ట‌. అంతేకాదు బీర్ తాగ‌డం వ‌ల్ల మెద‌డులో కొత్త క‌ణాలు వృద్ధి చెందుతూ జ్ఞాప‌క‌శ‌క్తి, ఏకాగ్ర‌త, రీజ‌నింగ్ ప‌వ‌ర్ వంటివి పెరుగుతాయ‌ట‌. వృద్ధాప్యంలో అల్జీమ‌ర్స్‌, దెమెంతియా వంటి వ్యాధులను రాకుండా చూసుకోవ‌చ్చ‌ట‌.
ఎముక‌ల‌కు…
బీర్ల‌లో సిలికాన్ ఎక్కువ‌గా ఉంటుంద‌ట‌. ఇది ఎముక‌ల పోష‌ణకు ఎంత‌గానో అవ‌స‌ర‌మ‌వుతుంద‌ట‌. కాబ‌ట్టి బీర్‌ను తాగితే అందులోని సిలికాన్ వ‌ల్ల ఎముక‌ల‌కు బ‌లం చేకూరుతుంది. 2009లో టఫ్ట్స్ యూనివ‌ర్సిటీ చేసిన ప‌రిశోధ‌న‌ల్లో ఈ విష‌యం తెలిసింది.

ప్రోస్టేట్ క్యాన్స‌ర్‌కు…
బీర్‌లో క్యాన్స‌ర్‌ల‌కు వ్య‌తిరేకంగా పోరాడే ఔష‌ధ గుణాలు ఉన్నాయి. త‌గిన మోతాదులో బీర్‌ను తీసుకుంటే ప్రోస్టేట్ క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశం కూడా త‌క్కువ‌గా ఉంటుంద‌ట‌.

డ‌యాబెటిస్‌కు…
బీర్ల‌లో ఉండే ఆల్క‌హాల్ ఇన్సులిన్ సెన్సిటీవిటీని అధికం చేస్తుంద‌ట‌. దీని వ‌ల్ల డ‌యాబెటిస్ వ‌చ్చే అవ‌కాశాలు త‌గ్గుతాయ‌ట‌. 2011లో హార్వ‌ర్డ్ యూనివ‌ర్సిటీ ప‌రిశోధ‌కులు చేసిన ఓ రీసెర్చి ప్ర‌కారం త‌ర‌చూ త‌గిన మోతాదులో బీర్ల‌ను తాగుతున్న వారిలో టైప్ 2 డ‌యాబెటిస్ వ‌చ్చే అవ‌కాశాలు 25 శాతం వ‌ర‌కు త‌గ్గుముఖం ప‌ట్టాయ‌ట‌. బీర్ల‌లో ఉండే సాల్యుబుల్ ఫైబ‌ర్ డ‌యాబెటిస్ ఉన్న‌వారికి మేలు చేస్తుంద‌ట‌.
చ‌ర్మ సౌంద‌ర్యానికి…
నిత్యం త‌గినంత బీర్‌ను తాగితే ఎప్ప‌టికీ య‌వ్వ‌నంగా క‌నిపిస్తార‌ట‌. వృద్ధాప్య ఛాయ‌ల కార‌ణంగా వ‌చ్చే ముడ‌త‌లు త‌గ్గిపోతాయ‌ట‌. ప్రాచీన కాలంలో ఈజిప్షియ‌న్లు ఎక్కువ‌గా బీర్‌తో స్నానం చేసేవార‌ట‌. దీంతో వారు ఎక్కువ యంగ్‌గా క‌నిపించేవార‌ట‌.

వెంట్రుక‌ల సంర‌క్ష‌ణ‌కు…
బీర్‌లో విట‌మిన్ బి, ఈస్ట్ వంటివి పుష్క‌లంగా ఉంటాయి. దీని వల్ల బీర్ వెంట్రుక‌ల‌కు ఆరోగ్యాన్నిస్తుంది. శిరోజాలు ఒత్తుగా, దృఢంగా పెర‌గ‌డంలో బీర్ ఉపయోగ‌ప‌డుతుంది.

మీ పేరులోని A,E,I,O,U అచ్చులను లెక్కేసి చూడండి ! ఫైనల్ నెంబర్ తో మీరే టైపో తెలుసుకోండి.న్యూమరాలజీ…ఇప్పుడు మంచి ట్రెండింగ...
03/06/2016

మీ పేరులోని A,E,I,O,U అచ్చులను లెక్కేసి చూడండి ! ఫైనల్ నెంబర్ తో మీరే టైపో తెలుసుకోండి.

న్యూమరాలజీ…ఇప్పుడు మంచి ట్రెండింగ్ టాపిక్, పేర్లలో కొన్ని అక్షరాలను తొలగించడమో..లేక కొత్త అక్షరాలను కల్పించడమో జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఓ టైప్ ఆప్ న్యూమరాలజీ గురించి చర్చిద్దాం. మీ పేరులోని ఇంగ్లీష్ అచ్చులు ( A,E,I,O,U) ల ప్రకారం మీ వ్యక్తిత్వాన్ని తెల్పుతుంది. దీని కొరకు కొన్ని స్టెప్స్ ఉన్నాయి. వాటిని ఈవిధంగా ఫాలో అవ్వండి.

Sterp:1
ఇంటి పేరుతో సహా మీ మొత్తం పేరును ఇంగ్లీష్ లో రాయండి.
Ex: Konidela Chiranjeevi.
Step:2
ఈ పేరులో ఉన్న అచ్చులను అంటే AEIOU లను మాత్రమే ఓ పక్కకు రాసుకోండి.
Ex : పై పేరులోని అచ్చులను సెపరేట్ గా రాస్తే. _o_i_e_a__i_a__ee_i.
Step: 3
వరుస క్రమాన్ని బట్టి ఈ అచ్చులకు నెంబరింగ్ ఇవ్వాలి అంటే A=1, E=2, I=3, O=4, U=5.
Ex: పై పేరును బట్టి. 0=4, i=3 e=2 a=1 i=3 a=1 e=2 e=2 i=3.
Step:4
అన్నింటిని కూడాలి.
Ex: పై పేరు ప్రకారం…. అన్నింటిని కూడితే……4+3+2+1+3+1+2+2+3=21.
Step:5
సింగిల్ నెంబర్ వచ్చే వరకు ఫైనల్ నెంబర్ ను కూడాలి.
Ex:2+1=3.
ఇప్పుడు ఫైనల్ గా వచ్చే నెంబర్ ను బట్టి వారి వ్యక్తిత్వాన్ని ఈ విధంగా అంచనా వేయాలి.

Numbers
బర్త్ నంబర్ 1 అయితే పుట్టుకతోనే వీరు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఎల్లప్పుడు పట్టుదలను, ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు. నలుగురిలో ఒకరిగా కాక వారిలో ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటారు. వీరిలో సృజనాత్మక శక్తి ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని సార్లు తలెత్తే ఇగో సమస్య వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు.
బర్త్ నంబర్ 2 అయితే వీరు తమ సొంత నైపుణ్యాలతో జీవితంలో పైకి ఎదుగుతారు. లక్ష్యసాధన దిశగా పనిచేసే అలవాటును కలిగి ఉంటారు. అయితే కొన్ని సార్లు ఎమోషన్ అవుతుంటారు. ఈ సందర్భంలోనే ఇలా ఎమోషన్ అయి ఇతరులను కూడా ఇబ్బంది పెడతారు.
బర్త్ నంబర్ 3 అయితే వీరు ఎల్లప్పుడూ సాహసాలను చేయాలని కోరుకుంటారు. ఇతరుల పట్ల మంచి కమ్యూనికేషన్‌ను కలిగి ఉంటారు. ఇతరులను పాజిటివ్ దిశగా నడిపిస్తారు. కొన్ని సందర్భాల్లో వీరిని ఇతరులు తప్పుగా అర్థం చేసుకుంటారు.
బర్త్ నంబర్ 4 అయితే వీరిలో అనంతమైన శక్తి దాగి ఉంటుంది. కానీ దాని గురించి వారికి తెలియదు. ఆ శక్తిని సరిగ్గా ఉపయోగించుకోవడంలో అప్పుడప్పుడు విఫలమవుతుంటారు.
బర్త్ నంబర్ 5 అయితే వీరు ఎక్కువగా స్వేచ్ఛను కోరుకుంటారు. కొత్త విషయాలను నేర్చుకోవడంపై ఆసక్తిని ప్రదర్శిస్తుంటారు. అయితే కొన్నిసార్లు వీరిలో ఓర్పు నశిస్తుంది. ఓర్పును జయించి కష్టపడితే విజయాన్ని సొంతం చేసుకోగలుగుతారు.
బర్త్ నంబర్ 6 అయితే వీరు ఎల్లప్పుడూ తాము చేసే పనిలో కచ్చితత్వం కోరుకుంటారు. ఇది వారిని ఇబ్బందుల్లోకి నెట్టివేస్తుంది. అయితే వీరు ఇతరుల పట్ల స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తూ వారికి సహాయం చేస్తారు. ఇది వారికి మరింత ఉపయోగపడుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో పట్టుదలకు పోతుంటారు.
బర్త్ నంబర్ 7 అయితే వీరు మంచి ఆలోచనా శక్తిని కలిగి ఉంటారు. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. విశ్లేషణాత్మక మనసు కలిగి ఉంటారు. ఏ విషయంలోనైనా వెనక్కి తగ్గరు. కొన్ని సందర్భాల్లో వీరు స్వార్థపూరితంగా ఉంటారు.
బర్త్ నంబర్ 8 అయితే వ్యాపారంపై మంచి అవగాహన కలిగి ఉంటారు. ఎల్లప్పుడూ అదే ధ్యాసలో ఉంటారు. వీరు మంచి పరిపాలన నైపుణ్యాలు కలిగి ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో మితిమీరిన ఆత్మవిశ్వాసం కలిగి ఉండడంతో అది వారి కొంప ముంచే అవకాశం ఉంటుంది.
బర్త్ నంబర్ 9 అయితే వీరు సృజనాత్మకమైన ఊహాలోకంలో విహరిస్తుంటారు. ఇతరులకు వీరు ప్రేరణగా నిలుస్తారు. అయితే సొంత విషయంలో మాత్రం అంతగా శ్రద్ధ చూపరు.

మీరెప్పుడైనా రైలు ఎక్కారా? అదేం ప్ర‌శ్న‌, రైలు ఎక్క‌ని వారు ఎవ‌రైనా ఉంటారా? అని అడ‌గ‌బోతున్నారా? అయితే అస‌లు మ్యాట‌ర్ మా...
01/06/2016

మీరెప్పుడైనా రైలు ఎక్కారా? అదేం ప్ర‌శ్న‌, రైలు ఎక్క‌ని వారు ఎవ‌రైనా ఉంటారా? అని అడ‌గ‌బోతున్నారా? అయితే అస‌లు మ్యాట‌ర్ మాత్రం అది కాదు లెండి. ఎందుకంటే ఆ ప్ర‌శ్న‌కు ఇంకా కొన‌సాగింపు ఉంది. అదేమిటంటే… రైలు ఎక్క‌డానికి స్టేష‌న్‌కు వెళ్లిన‌ప్పుడు రైలు బోగీల‌ను జాగ్ర‌త్త‌గా గ‌మ‌నించారా. ప్ర‌ధానంగా రైలు చివ‌రి పెట్టె వెనుక భాగాన్ని ప‌రిశీలించారా? ప‌రిశీలించాం, చూశాం, అయితే ఏమిటి అంటారా? ఆ, అయితే అక్క‌డే ఆగండి. రైలు చివ‌రి పెట్టె వెనుక భాగంలో ఆంగ్ల అక్ష‌రం X అని పెద్ద‌గా రాసి ఉంటుంది. దాన్ని ఎప్పుడైనా చూశారా? చూశాం, అయితే ఏంటి అంటారా? ఆ, అదే… దాని గురించే మేం చెప్ప‌బోయేది. అస‌లు అలా X అని ఎందుకు రాసి ఉంటుందో మీకు తెలుసా? తెలీదా? అయితే ఎందుకో తెలుసుకోండి!
రైలు బోగీల్లో చివ‌రి బోగీ వెనుక X అని రాసి ఉంటే ఆ రైలుకు ఆ పెట్టే చివ‌రిది అని అర్థం. అంతేకాదు ఆ X అక్ష‌రం కిందే ఓ ఎర్ర‌ని లైటు, దాని ప‌క్క‌నే LV అనే ఓ బోర్డు కూడా త‌గిలించ‌బ‌డి ఉంటుంది. ఇవన్నీ X అక్ష‌రం లాగే ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వీటి వ‌ల్ల రైలుకు ఉన్న ఆ పెట్టెను చివ‌రి పెట్టెగా ప‌రిగ‌ణిస్తారు. అయితే X అక్ష‌రం ప‌గటి స‌మ‌యంలో ఉప‌యోగ‌ప‌డితే, ఎర్ర‌ని లైటు రాత్రి పూట ఉప‌యోగ‌ప‌డుతుంది. దీని వ‌ల్ల వాటిని చూసే వారు ఆ రైలు అన్ని పెట్టెల‌తోనే వెళ్తుంద‌ని అర్థం చేసుకుంటారు. ఒక వేళ రైలు చివ‌రి పెట్టెకు ఈ అక్ష‌రాలు ఏవీ లేక‌పోతే అది ప్ర‌మాద‌వ‌శాత్తూ కొన్ని బోగీలు లేకుండానే న‌డుస్తుంద‌ని తెలుసుకుంటారు. దీంతో వెంట‌నే అప్ర‌మ‌త్త‌మై సంబంధిత అధికారుల‌కు తెలియ‌జేస్తారు. సో, రైలు చివ‌రి పెట్టె వెనుక ఉన్న అక్ష‌రాల మ‌త‌ల‌బు అద‌న్న‌మాట‌. ఇక ముందు మీరెప్పుడైనా వాటిని చూస్తే ఇంకాస్త జాగ్ర‌త్త‌గా ప‌రిశీలించండేం. పైన చెప్పిన అక్ష‌రాలు అన్నీ క‌నిపిస్తాయి. ఒక వేళ క‌నిపించ‌కుంటే మాత్రం ఎవ‌రికైనా రైల్వే అధికారుల‌కు తెలియ‌జేయ‌డం మాత్రం మ‌రిచిపోకండి.

Address

Hyderabad
500060

Telephone

8686990600

Website

Alerts

Be the first to know and let us send you an email when Twenty Four by Seven posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share