Nizamabad news

Nizamabad news nizamabad is beautiful distict in telangana state up to date information gathering for public service

07/09/2022

__________పత్రిక ప్రకటన________

*DAMU కృషి విజ్ఞాన కేంద్రం, నిజామాబాద్ (రుద్రూర్)*

🌧️ *వాతావరణ హెచ్చరిక*

తేది: 07.08.2022 (బుధవారం)

శీర్షిక : *ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలకు భారీ వర్ష సూచన*

👉🏻 సెప్టెంబర్ 07 న తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ ఆవర్తనం ప్రభావంతో రాగల 24 గంటలలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉంది.ఈ అల్పపీడనం ప్రభావంతో *రాగల 3 రోజులలో* ( ముఖ్యంగా సెప్టెంబర్ 09,10 మరియు 11వ తేదీలలో) నిజామాబాద్ మరియు కామారెడ్డి జిల్లాల్లో పలు చోట్ల *ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు* (15.6 నుండి 64.4 మి. మీ) *నుండి భారీ వర్షం* (64.5 నుండి 115.4 మి. మీ) వర్షం కురిసే అవకాశం ఉంది.

🌩️⚡ *పిడుగు పాటుకు గురికాకుండా ఉండేందుకు:*

👉🏻 పశువులను చెట్ల క్రింద కట్టి ఉంచకుండా పాకలలో కట్టి ఉంచాలి.
👉🏻ప్రజలు బహిరంగ ప్రదేశాలలో ఉండకుండా భావనాల క్రిందే తలదాల్చుకోవాలి.
👉🏻విద్యుత్ పరికరాలకు దూరంగా ఉండాలి.
👉🏻రైతులు పంట పొలాల్లో ఎటువంటి రసాయన మందులను పిచికారి చేయకుండా అయిదు రోజుల వరకు వాయిదా వేసుకోవాలి.

ఇట్లు,
శ్రీలక్ష్మి,
శాస్త్రవేత్త,
వ్యవసాయ వాతావరణ విభాగం,
కృషి విజ్ఞాన కేంద్రం, నిజామాబాద్.

07/09/2022

2014 కన్నా ముందు చాలా మంది నాయకులు వచ్చారు పోయారు కానీ 50 ఏళ్ళలో జరగని అభివృద్ధి తెలంగాణ వచ్చాక కెసిఆర్ నిజామాబాదు నగరానికి నిదులిచ్చి అభివృద్ధి చేయిస్తున్నారు..

బిజెపి భారీ బహిరంగ సభ అని ఫ్లెక్సీలు వేశారు..
ఒక చిన్న ఫంక్షన్ హాల్ లో ఐదు వందల మందితో నిర్వహించింది బహిరంగ సభ ఎట్లవుతది.. ..

గిరిరాజ్ కళాశాలలో చేపట్టిన
మాది బహిరంగ సభ.

బిజెపి నేతలకు
దమ్మూ ధైర్యం ఉంటే అభివృద్ధిలో పోటీ పడాలి..

పించన్లు మేము రెండు వేలిస్తున్నాము దాన్ని పెంచి ఇవ్వండి..

ప్రజల కడుపు నింపితే ప్రజలు హర్షిస్తారన్న లాజిక్ బిజెపి నేతలు మర్చిపోయారు..

ఎంతసేపూ తెరాసను విమర్శించడం..ఈడీ సిబిఐ అని చెప్పడం తప్ప వారు చేసేదేమీ లేదు‌‌..

ఫ్లెక్సీలు చింపే సంస్క్రుతి ఎక్కడిది..
దమ్ముంటే వారు కూడా భారీ బహిరంగ సభ పెట్టుకోండి ఎవరద్దన్నారు


నిజామాబాదు ప్రెస్ క్లబ్ లో మీడియాతో చిట్ చాట్ లో ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్త వ్యాఖ్యలు

ఆర్మూర్ పట్టణంలో వివాహిత హత్య భార్యను చంపి పిల్లలతో పరారీ అయిన భర్త
05/09/2022

ఆర్మూర్ పట్టణంలో వివాహిత హత్య
భార్యను చంపి పిల్లలతో పరారీ అయిన భర్త

తెలంగాణ ఏర్పాటు తర్వాత భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనంత ప్రగతి తెలంగాణలో జరుగుతుంది...అభివృద్ధిలో అగ్రభాగాన ఉన్న తెలంగాణను ...
05/09/2022

తెలంగాణ ఏర్పాటు తర్వాత భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనంత ప్రగతి తెలంగాణలో జరుగుతుంది...అభివృద్ధిలో అగ్రభాగాన ఉన్న తెలంగాణను మనమంతా ఐక్యంగా మరింత ముందుకు తీసుకెళ్ళాలి..నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవ సందర్భంగా సిఎం కెసిఆర్

తెరాస సభా వేదికపైకి చేరుకున్న సిఎం కెసిఆర్.. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసిన సిఎం‌.. అమరవీరుల. స్తూపానికి పూలు వేసి నివాళులు అర్పించిన సిఎం

భారదేశ మొత్తంలో 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ

దళిత కుటుంబాలకు పది లక్షలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ

తండాలను గ్రామ పంచాయతీలు చేసిన ఘనత తెలంగాణాదే

కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టమంటున్నారు..విమానాలు, ఓడలు బ్యాంకులు అమ్మిండ్రు..ఇప్పుడు
మిగిలింది రైతుల భూములు.. రైతుల భూములు లాక్కునే కుట్రలో భాగమే మోటార్లకు మీటర్లు..కార్పొరేట్ కంపెనిలకు భూములు అప్పగించే కుట్ర కేంద్రానిది..

రాబోయే రోజుల్లో బిజెపియేతర ప్రభుత్వం రానుంది...
దిల్లీ గద్దె మీద మన ప్రభుత్వమే రానుంది.. బిజెపి ముక్త్ భారత్ ను ఎన్నుకోండి..దేశవ్యాప్తంగా ఉచిత విద్యుత్ ఇస్తాం..మనమంతా ఏకమై ఎవరైతే బాయి కాడ మీటర్లు పెట్టమంటుండ్రో వారికే మీటర్లు పెడదాం...
మోదీ ప్రభుత్వం ఎవరినీ ఉద్దరించింది లేదు..ఒక్క ప్రాజెక్టు కట్టలేదు
ప్రతిపక్షాలను చీలుస్తూ అహంకారపూరిత పాలన మోది కొనసాగిస్తున్నారు

ఆరోగ్యకర రాజకీయం ఉంటేనే దేశం బాగుంటుంది..

: దేశ రాజకీయాలకు వెల్దాం..ఎంతకైనా తెగిద్దాం..జాతీయ రాజకీయ ప్రస్తానం మొదలు పెడదాం

👆👆సిఎం కెసిఅర్ వ్యాఖ్యలు

04/09/2022
New collectarate portions deportment wise
27/08/2022

New collectarate portions deportment wise

26/08/2022

ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి చరిత్రలో అరుదైన రికార్డు ...
ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నిజామాబాదులో ఒకే రోజున రికార్డు స్థాయిలో 59 శస్త్ర చికిత్సలు చేయడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు గైనకాలజీ విభాగం - 20 జనరల్ సర్జరీ విభాగం - 09 ఎముకల విభాగం - 08 ENT విభాగం - 02 కంటి విభాగం i - 20 మొత్తం -59 శస్త్ర చికిత్సలు చేయడం జరిగింది ఇందులో అత్యవసరమైనవి 22 సర్జరీలు ఉన్నాయి..
ఈ సందర్భంగా డాక్టర్ ప్రతిమ రాజ్ సూపరింటెండెంట్ గారు... డాక్టర్ మధులత గైనకాలజీ విభాగాధిపతి గారికి మరియు వారి బృందానికి ,
డాక్టర్ సునీల్ జనరల్ సర్జరీ విభాగాధిపతి గారికి మరియు వారి బృందానికి,
డాక్టర్ నాగేశ్వరరావు ఎముకల విభాగాధిపతి గారికి మరియు వారి బృందానికి,
డాక్టర్ సునీల్ కుమార్ ENT విభాగాధిపతి గారికి మరియు వారి బృందానికి,
డాక్టర్ సుజాత ఆప్తాల్మిక్ విభాగాధిపతి గారికి మరియు వారి బృందానికి,
మరియు డాక్టర్ కిరణ్ అనస్థీషియా విభాగాధిపతి గారికి మరియు వారి బృందానికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేశారు....

26/08/2022

*ప్రచురణార్థం*
చదువుతూనే ఉద్యోగం - గొప్ప అవకాశం :::: ఇంటర్ విద్యా అధికారి రఘురాజ్

నిజామాబాద్ ఆగస్టు 24: హెచ్.సి.ఎల్. టెక్ బీ ఎర్లీ కెరీర్ ప్రోగ్రాంలో చేరి, చదువుతూనే ఉపాధి అవకాశం పొందడం గొప్పవరo అని జిల్లా ఇంటర్ విద్యా అధికారి శ్రీ రఘురాజ్ అన్నారు.
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గిరిరాజ్ డిగ్రీ కళాశాల ఆవరణలోని ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన ఆదేశాల మేరకు హెచ్.సి.ఎల్. టెక్ సంస్థ ఆధ్వర్యంలో 2021-22 విద్యా సంవత్సరం ఇంటర్ ఎమ్.పి.సి., ఎమ్.ఈ.సి. పూర్తి చేసిన విద్యార్థులకు ఉద్యోగం తో పాటు ఉన్నత చదువులకు అవకాశం కల్పించే కార్యక్రమంలో జిల్లా ఇంటర్ విద్యా అధికారి ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. ప్రముఖ సాఫ్ట్వేర్, బిట్స్ పిలాని సంస్థ లలో విద్యా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఎచ్.సి.ఎల్. కృషి అభినందనీయమని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులకు ఇది మంచి అవకాశం అని అన్నారు. డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రామ్మోహన రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి అవకాశం విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. హెచ్.సి.ఎల్. సంస్థ చేస్తున్న కృషి నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ధోహద పడుతోందని అన్నారు. హెచ్. సి. ఎల్. సంస్థ రాష్ట్ర ప్రతినిధి శ్రీనివాస్ మాట్లాడుతూ
ఇంటర్మీడియట్ పూర్తి చేసి టెక్నాలజీని కెరీర్ గా ఎంచుకుని, ఉపాధి కోరుకునే వారికి ఇది గొప్ప అవకాశమని అన్నారు. మేథ్స్/ బిజినెస్ మేథ్స్ లో 2021-2022 విద్యా సంవత్సరం ఇంటర్మీడియట్ బోర్డు పరీక్ష ఉత్తీర్ణులై, 60% ఓవరాల్, 60% గణితంలో మార్కులు పొందిన వారు దీనికి అర్హులన్నారు. సాప్ట్ వేర్ డెవలపర్, అనలిస్టు, డిజైన్ ఇంజనీర్, డేటా ఇంజనీర్, సపోర్ట్ & ప్రాసెస్ అసోసియేట్ తదితర ఉద్యోగాలు ఉంటాయని ఆయన తెలిపారు. టెక్ బీ ప్రోగ్రాంలో చేరిన విద్యార్థులకు శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత హెచ్ .సి.ఎల్. కంపెనీలో ‌ఫుల్ టైం ఉద్యోగులుగా నియామకం ఉంటుందని ఆయన అన్నారు. ఈ ప్రోగ్రాంలో భాగంగా క్లాస్ రూమ్ ట్రైనింగ్ మరియు ఇంటర్న్షిప్ ఉంటాయని, రూ. 10,000/- స్టెయిఫండ్ ఇవ్వబడునని ఆయన అన్నారు. ప్రోగ్రాం పూర్తి చేసిన తర్వాత ఉద్యోగాన్ని బట్టి ఏడాదికి రూ. 2.2 లక్షల వేతనంతో కెరీర్ ప్రారంభం అవుతుందన్నారు. అనంతరం అభ్యర్థులు బిట్స్ పిలాని, శస్త్ర మరియు అమిటి యూనివర్సిటీలు అందించే గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాంను చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ఈ టెక్ బీ ఒక సంవత్సరం శిక్షణ కు అయ్యే రూ. 1.18 లక్షల ఫీజును ఎడ్యుకేషనల్ లోన్ ద్వారా చెల్లించే వెసులుబాటు హెచ్.సి.ఎల్. కల్పిస్తుందన్నారు. విద్యార్థులు అధిక సంఖ్యలో
ఈ ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వడానికి సంబంధించిన సెలక్షన్ డ్రైవ్ పాల్గొన్నారు.
సెలక్షన్ డ్రైవ్ లో రిట్టెన్ ఎగ్జాం, ఇంటర్వ్యూ నిర్వహించారు. హెచ్.సి.ఎల్. సంస్థ ప్రతినిధి రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.

13/08/2022

STRONG RAINS from Nanded moving east, very soon Nizamabad, Bodhan, Armur belt and also Kamareddy, Banswada, Pitlam belt will definetely get good rains in next 2hrs

By night these rains will further spread into other districts of Telangana.

Address

Nizamabad
Nizamabad
503001

Alerts

Be the first to know and let us send you an email when Nizamabad news posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Nizamabad news:

Share